ఎంత డబ్బు ఇచ్చినా.. అలాంటి పని మాత్రం చేయను.. కంగనా షాకింగ్ కామెంట్స్?

praveen
బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా హవా నడిపిస్తున్న కంగనా రనౌత్ గురించి కొత్తగా సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు  ఎందుకంటే ఈమె సినిమాలతో ఎంతలా అయితే గుర్తింపును సంపాదించుకుందో.. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కూడా అంతగానే అందరికీ సుపరిచితురాలుగా మారిపోయింది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా బాలీవుడ్ ఇండస్ట్రీకి నటిగా పరిచయమైన కంగానా రనౌత్ ఇక తన నటనతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది అని చెప్పాలి. ఎలాంటి పాత్రలోకి అయినా సరే పరకాయ ప్రవేశం చేస్తూ అదరగొడుతూ ఉంటుంది  ఇక కెరియర్ మొదట్లో ఎన్నో గ్లామర్ రోల్స్ లో కూడా నటించి కుర్ర కారు మతి పోగొట్టింది ఈ ముద్దుగుమ్మా.

 ఇక టాలీవుడ్ లో ప్రభాస్ హీరోగా నటించిన ఏక్ నిరంజన్ మూవీలో డార్లింగ్ ప్రభాస్ సరసన నటించి ఆకట్టుకుంది అని చెప్పాలి. కానీ ఈ మూవీ పెద్దగా హిట్ అవ్వలేదు. ఇక ఇప్పుడు లేడి ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటుంది. అయితే ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది కంగనా. ఆమె ఏ విషయంపై కామెంట్స్ చేసిన అవి సంచలనంగా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే ముఖేష్ అంబానీ కొడుకు ఆనంత్ అంబానీ ఫ్రీ వెడ్డింగ్ వేడుక గురించి కంగానా చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయి. బాలీవుడ్ ఖాన్స్ గా పిలుచుకునే షారుక్, అమీర్, సల్మాన్ ముగ్గురు కూడా అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు. అయితే డబ్బులు తీసుకొని పెళ్లికి హాజరవ్వడం.. ఇలా డాన్సులు చేయడం ఏంటి అని కొన్ని విమర్శలువచ్చాయి.

 ఇదే విషయం గురించి కంగనా రనౌత్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏకంగా అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో సెలబ్రెటీలు డాన్సులు చేయడంపై సెటైర్లు వేసింది. తనకు ఎంత డబ్బు ఇచ్చిన అలాంటి ప్రదర్శనలు చేయను అంటూ ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ పెట్టింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ పెళ్లిళ్లలో అవార్డు వేడుకలలో ప్రదర్శనలు ఇచ్చేందుకు ఒప్పుకోలేదు  నేను కూడా అంతే. డబ్బు కంటే గౌరవం ముఖ్యమని బలంగా నమ్ముతాను అంటూ కంగనా చెప్పుకొచ్చింది. కాగా స్టార్ హీరోలను ఉద్దేశించి కంగానా చేసిన కామెంట్స్ కాస్త ప్రస్తుతం సంచలనంగా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: