ఆ పాకిస్తాన్ క్రికెటర్ పై క్రష్ ఉండేది.. నటి జయసుధ షాకింగ్ కామెంట్స్?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో సహజ నటిగా గుర్తింపును సంపాదించుకుంది జయసుధ. ఒకప్పటి యాక్టింగ్ లెజెండ్స్ అయినా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు లాంటి వారి సరసన నటించి అందరికీ పర్ఫెక్ట్ జోడి అనిపించుకుంది. ఇక తన నటనతో పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసిన ఈమె ఇక టు తెలుగు ప్రేక్షకుడి హృదయంలో కూడా ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది అని చెప్పాలి. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ భాషలో కూడా హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకుని జయసుధ.

 ఇక ఆ తర్వాత కాలంలో సహాయ నటిగా నేటి జనరేషన్ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. హీరో హీరోయిన్లకు తల్లిగా నానమ్మగా పాత్రలు చేస్తూ అదరగొడుతుంది అని చెప్పాలి. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూకి హాజరైన సీనియర్ నటి జయసుధ.. తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది. ఈ క్రమంలోనే ఒక క్రికెటర్ అంటే తనకు క్రష్ ఉండేది అన్న విషయాన్ని తెలిపింది. తన బాల్యం మొత్తం చెన్నైలో జరిగింది. చపాక్ స్టేడియం పక్కనే మా ఇల్లు ఉండేది. ఇక స్టేడియంకి మా ఇంటికి మధ్య ఒక రోడ్డు మాత్రమే ఉండేది. అయితే అప్పుడు ఎంతోమంది క్రికెట్ ప్రముఖులు కూడా నేను చదువుకున్న స్కూల్లోనే చదువుకునేవాళ్ళు.

 ఇక స్టేడియం దగ్గరగా ఉండడంతో ఎన్నోసార్లు స్టేడియంలోకి వెళ్లి మ్యాచ్లు చూసేదాన్ని. ఇక ఆ సమయంలో తనకు పాకిస్తాన్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ అంటే క్రష్ ఏర్పడింది అంటూ జయసుధ చెప్పుకొచ్చింది. అప్పట్లో అందరికంటే అతను ఎంతో హ్యాండ్సమ్ గా ఉండేవాడు. అందుకే తాను మాత్రమే కాదు ఎంతోమంది ఆయనను ఇష్టపడేవారు అంటూ తెలిపింది. అయితే ఇలా స్టేడియం కు వెళ్తూ వెళ్తూ ఫస్ట్ నేను క్రికెటర్ అవ్వాలనుకున్న. ఇక సెకండ్ ఆప్షన్ సినిమాల్లోకి రావాలనుకున్న. మూడోది టీచర్ అవ్వాలని అనుకునేదాన్ని అంటూ జయసుధ తెలిపింది. ఇక ఇండియన్ క్రికెట్ లో నా ఫేవరెట్ సునీల్ గవాస్కర్ అంటూ చెప్పుకొచ్చింది జయసుధ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: