చిరంజీవి విశ్వంభర చిత్రంలో విలన్ అతడేనా..?

Divya
వచ్చేయేడాది టాలీవుడ్ నుంచి భారీ చిత్రాలు ప్రేక్షకులను అలరించబోతున్నాయి.. ముఖ్యంగా చెప్పుకోదగ్గ సినిమాలలో చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కూడా ఒకటి.. డైరెక్టర్ వశిష్ట ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఫాంటసీ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చేయేడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.. ఈ చిత్రానికి సంబంధించి ఏదో ఒక న్యూస్ అందర్నీ ఆసక్తి రేపేలా చేస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని హీరోయిన్స్ ఎంపిక విషయంలో పాటు చిరంజీవికి చెల్లెలుగా నటిస్తున్న హీరోయిన్స్ పైన కూడా ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా విశ్వంభర సినిమాలో విలన్ గా ఎవరు నటిస్తారనే విషయం వైరల్ గా మారుతోంది .. ఇప్పుడు తాజాగా విలన్ గా ఎవరు నటిస్తారనే విషయం వైరల్ గా మారుతోంది.


అయితే అందుతున్న సమాచారం ప్రకారం విశ్వంభర చిత్రంలో రావు రమేష్ విలన్ గా నటించబోతున్నారు.. అయితే మొదట హిందీ నటుడు కోసం సంప్రదించక ఆ పాత్రకు సరిపోయే వారు దొరకకపోవడంతో రావు రమేష్ ని తీసుకోబోతున్నట్లు సమాచారం.. రావు రమేష్ ఇలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి మరి నటిస్తూ ఉంటారు ముఖ్యంగా చిరంజీవితో సమానంగా నటించగలిగిన నటుడని చెప్పవచ్చు.. హీరోయిన్గా త్రిష నటిస్తున్నట్లు సమాచారం.


ఈ చిత్రంలో చిరంజీవి దొరబాబు అనే పేరుతో నటించబోతున్నారట. చిరంజీవి చెల్లెలుగా ఇషా చావ్ల చాల కీలకమైన పాత్రలో నటించబోతోందట. ఈమెతో పాటు రమ్య పసుపులేటి కూడా ఈ సోషియో ఫాంటసీ వెంచర్లు కనిపించబోతోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో చిరంజీవితో కలిసి దిగిన ఒక ఫోటోను కూడా షేర్ చేసింది. వీరితో పాటు ప్రముఖ నటీనటులు సైతం కీలకమైన పాత్రలు నటిస్తున్నారు.. ప్రముఖ నిర్మాణ సంస్థ UV క్రియేషన్ బ్యానర్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. విశ్వంభర చిత్రానికి సంబంధించి అఫీషియల్ గా చిత్ర బృందం ఎలాంటి క్లారిటీలు ఇస్తాయో చూడాలి మరి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: