కల్కి 2898 ఏడీ నుంచి మెంటల్ ఎక్కించే న్యూస్?

Purushottham Vinay
సలార్ మూవీతో యావరేజ్ హిట్ అందుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం కల్కి 2898 ఏడీ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ జోనర్ తో తెరకెక్కుతున్న ఈ మూవీని నాగ్ అశ్విన్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ ఇంకా కమల్ హాసన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీపై హైప్ నెక్స్ట్ లెవల్ లో ఉంది.ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ తీస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి ఇప్పటికే వచ్చిన అప్డేట్లు సినిమాను కచ్చితంగా ఒక్కసారైనా చూడాల్సిందేనన్న హైప్ క్రియేట్ చేశాయి. అయితే టాలీవుడ్ లో ప్రస్తుతం నడుస్తున్న 2 పార్ట్స్ ట్రెండ్ ను ఈ సినిమా ఫాలో అవుతుందో లేదో ఇప్పటి వరకు క్లారిటీ లేదు. కానీ నెట్టింట మాత్రం ఎన్నో రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే సెకండ్ పార్ట్ కు లీడ్ ఇస్తూ.. ఫస్ట్ పార్ట్ ముగుస్తుందని అంటున్నారు.ఇప్పుడు సోషల్ మీడియాలో మరో వార్త చక్కర్లు కొడుతోంది. కల్కి మూవీ ఏకంగా తొమ్మిది పార్టులుగా రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో నడుస్తున్న సినిమాటిక్ యూనివర్స్ ట్రెండ్ ను కల్కి సినిమా కూడా ఫాలో కాబోతోందని అంటున్నారు. ఇప్పుడు ఈ టాక్ రావడానికి కారణం.. ఓ కమెడియన్ చేసిన కామెంట్స్. టాలీవుడ్ కమెడియన్ అభినవ్ గోమఠం.. కల్కి సినిమా తొమ్మిది పార్టులుగా రానుందని, తాను ఎక్కడో విన్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.అభినవ్ గోమఠం.. మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. ఈ నేపథ్యంలో ఇటీవల యాక్టర్ అలీ రెజాతో కలిపి ఓ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పాడు.ఇక కల్కి 2898 ఏడీ మూవీకి తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందిస్తున్నారు. వేసవి కానుకగా మే 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా చాలా భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. కానీ రిలీజ్ డేట్ మారితే మారొచ్చు. ఇక ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ తో నాగ్ అశ్విన్.. ఆడియన్స్ ను ఓ కొత్త వరల్డ్ లోకి తీసుకెళ్తారని తెలుస్తోంది.ఈ సినిమాలో ప్రభాస్ శ్రీ మహా విష్ణు మూర్తి 10 వ అవతారం కల్కి పాత్రలో నటించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: