హీరో
సూపర్ స్టార్ మహేష్ బాబుగురించి మనందరికి తెలిసిందే. ఇటీవల గుంటూరు కారం మూవీతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఇకపోతే మహేష్
మురారి మూవీతో సూపర్ హిట్ టాక్ ను అందుకున్నారు.మురారి
సినిమా తరువాత మహేష్ బాబు నటించిన
సినిమా ఒక్కడు.
గుణశేఖర్ దర్శకత్వం వహించిన మహేష్ బాబుని
సూపర్ స్టార్ ని చేసింది. అంతేకాకుండా మహేష్ బాబు క్రేజ్ ని పెంచడంతోపాటు కెరిర్ గ్రాఫ్ ని మార్చేసింది.
మణిశర్మ ఈ సినిమాకు
సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. ఇక ముఖ్యంగా సినిమాలో చార్మినార్ సెట్ న్యాచురాలిటీ అలాగే కొండారెడ్డి బురుజుదగ్గర ఇంటర్వెల్ బ్లాక్ మహేష్ బాబు ప్రకాష్ రాజుమధ్య సన్నివేశాలు అలాగే
భూమిక ప్రకాష్
రాజ్ మధ్య ట్రాక్, అలాగే క్లైమాక్స్ లో కబడ్డి ఫైట్.. ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో చాలా సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పవచ్చు.అయితే మహేష్ బాబు హీరోగా నటించిన ఈ ఒక్కడు
సినిమా తమిళంలో
విజయ్ హీరోగా గిల్లి అనే పేరుతో
రీమేక్ అయింది. అయితే ఎక్కువ శాతం మహేష్ బాబు సినిమాలనే
రీమేక్ చేసే
విజయ్ ఈ గిల్లి సినిమాతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అందుకే ఈ గిల్లి
సినిమా విజయ్ అభిమానులకు చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. అయితే ఒక్కడు సినిమాని
విజయ్ అభిమానులు ఇష్టపడడంలో తప్పులేదు కానీ, ఆ సినిమాను ఒక్కడు సినిమాతో కంపేర్ చేస్తూ, సోషల్ మీడియాలో ఒక్కడు
సినిమా కంటే గిల్లి
సినిమా బాగుంది. మహేష్ బాబు కంటే
విజయ్ బాగా నటించాడు అంటూ కామెంట్ చేయడం అన్నది ఏమి బాగోలేదు..ఇదే విషయంపై అభిమానులు వారికి దిగడం కూడా కరెక్ట్ కాదని చెప్పాలి. అయితే గత కొద్ది రోజులుగా
విజయ్ అభిమానులు అలాగే, మహేష్ అభిమానుల మధ్య ఈ విషయంలో చిన్నపాటి
వార్ జరుగుతూనే ఉంది. అది కాస్త చిలికి చిలికి
గాలి వానగా మారింది.