గుంటూరు కారం మూవీ ఆఫర్ పై.. నిజాలు బయటపెట్టిన రష్మి?

praveen
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సంక్రాంతికి గుంటూరు కారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కింది. ఈ క్రమంలోనే ఈ మూవీపై మొదటి నుంచి కూడా భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి. ఇలా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఎందుకొ ప్రేక్షకుల అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. త్రివిక్రమ్ మళ్ళీ రొటీన్ కథనే మార్చి మార్చి తీస్తున్నాడు అంటూ విమర్శలు కూడా వచ్చాయి. మహేష్ బాబు యాక్టింగ్ బాగున్న త్రివిక్రమ్ టేకింగ్ మాత్రం బోరింగ్ గా ఉంది అంటూ ఎంతో మంది విమర్శలు కూడా చేశారు.

 ఈ క్రమంలోనే సూపర్ డూపర్ విజయాన్ని సాధిస్తుంది అనుకున్న ఈ సినిమా చివరికి యావరేజ్ గానే మిగిలిపోయింది. ఇక ఇటీవలే ఓటీటిలో విడుదలైన తర్వాత కూడా పెద్దగా ప్రేక్షకులు ఈ సినిమాను పట్టించుకోలేదు. అయితే గుంటూరు కారం సినిమా మొత్తంలో ప్రేక్షకులకు నచ్చింది ఏదైనా ఉంది అంటే అది కూర్చి మడ్త పెట్టి అనే సాంగ్ అని చెప్పాలి. ఎందుకంటే ఇక ఈ సాంగ్లో శ్రీ లీలా మహేష్ బాబు డాన్స్ తో ఇరగదీసారు. శ్రీలీల ఎలాగో డాన్సుల్లో తోపు ఇక డాన్సులకు దూరంగా ఉండే మహేష్ బాబు సైతం శ్రీలీల ఎనర్జీని మ్యాచ్ చేస్తూ చేసిన డాన్స్ అదరగొట్టేసిండు. అయితే ఇక ఈ సాంగ్లో స్పెషల్ ఎట్రాక్షన్ గా కనిపించింది నటి పూర్ణ.

 ఈ సాంగ్లో తన డాన్సులతో తన ఎక్స్ప్రెషన్ అదరగొట్టేసింది అని చెప్పాలి. అయితే ఈ సాంగ్ గురించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారిపోయింది. ఈ పాటలో ముందుగా పూర్ణను కాకుండా జబర్దస్త్ యాంకర్ రష్మీకి ఛాన్స్ వచ్చింది అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు పై రష్మీ స్పందించింది. గుంటూరు కారం మూవీ టీం అసలు నన్ను సంప్రదించలేదు. ఇలాంటి ఫేక్ న్యూస్ నాపై నెగెటివిటీని తీసుకువస్తుంది. ఇలాంటి వార్తలను ప్రచారం చేయొద్దు. కుర్చీ మర్తపెట్టి పాటలో పూర్ణ అద్భుతంగా డాన్స్ చేసింది అంటూ రష్మీ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: