మెగాస్టార్ సినిమాలో.. మహేష్ బాబు హీరోయిన్?

praveen
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 60 ప్లస్ వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇచ్చే విధంగా సినిమాలను చేస్తూ ఉన్నాడు. ఒకే ఏడాది రెండు మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ జోరు చూపిస్తున్నారు చిరంజీవి. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలను చేస్తూనే ఉన్నారు. కాగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి అటు విశ్వంభరా అనే మూవీలో నటిస్తున్నాడు. వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. బింబిసారా లాంటి ఒక టైం ట్రావెల్ మూవీని ఎంతో బాగా హ్యాండిల్ చేసి సూపర్ హిట్ కొట్టిన వశిష్ట.. ఇక ఇప్పుడు మెగాస్టార్ తో సోషియో ఫాంటసీ మూవీ తీసేందుకు సిద్ధమయ్యాడు అని చెప్పాలి.

 అయితే విశ్వంభరా మూవీలో చిరంజీవి సరసన ఏ హీరోయిన్ నటించబోతుంది అనే విషయంపై కథ కొంతకాలం నుంచి చర్చ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో ఒక్కరు కాదు ఏకంగా నలుగురు హీరోయిన్లు ఉండబోతున్నారు అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే సీనియర్ హీరోయిన్ త్రిష విశ్వంభరా  సెట్స్ లో అడుగుపెట్టి షూటింగ్లో పాల్గొంటుంది అంటూ ఒక టాకు వినిపిస్తుంది. త్రిష తో పాటు ఇక మరో ముగ్గురు కథానాయకుల ఎంపిక చేసే పనిలో మేకర్స్ బిజీగా ఉన్నారట. ఈ క్రమంలోనే ఇందులో ఒకానొక హీరోయిన్గా మీనాక్షి చౌదరిని ఎంపిక చేశారట. సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగే కథ కావడంతో ఈ మూవీ కోసం సరికొత్త లోకాన్ని సృష్టించబోతున్నాడట డైరెక్టర్ వశిష్ట. అయితే దేవకన్య పాత్రలో మీనాక్షి చౌదరి కనిపించబోతుందట.

 కాగా ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మీనాక్షి చౌదరి వరుసగా అవకాశాలు అందుకుంటుంది అన్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన గుంటూరు కారం అనే సినిమాలో నటించింది. మహేష్ బాబు మరదలు పాత్రలో నటించి తన అందం అభినయంతో ఆకట్టుకుంది. ఇక సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఇక మంచి విజయాన్ని సాధించింది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: