ఓటీటీ బ్లాక్‌బస్టర్‌ సార్పట్టకి రీమేక్?

Purushottham Vinay
సూపర్ స్టార్ రజినీకాంత్ 'కబాలి' సినిమా డైరెక్టర్ పా. రంజిత్ నుండి కరోనా టైమ్ లో వచ్చిన సినిమా 'సార్పట్ట'. తమిళ స్టార్ హీరో ఆర్య హీరోగా నటించిన ఈ పీరియాడిక్ బాక్సింగ్ డ్రామా ఓటీటీలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది.థియేటర్‌లలో రిలీజ్ కాలేదు కానీ ఒకవేళ అయ్యి ఉంటే కచ్చితంగా వంద కోట్లు రాబట్టేదని అప్పట్లోనే టాక్ వచ్చింది. 2021లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ మూవీ ' ఓటీటీలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు విమర్శకులు, ప్రేక్షకులు మెస్మరైజ్ అయ్యారు.తమిళంతో పాటు తెలుగు లో కూడా ఈ సినిమాకి భారీ స్పందన లభించింది. తమిళనాడులో జరిగే స్ట్రీట్ బాక్సింగ్ టోర్నమెంట్‌ల నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ను కూడా ప్రకటించారు. 'సార్పాట్ట రౌండ్ 2' పేరిట ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ విషయాన్ని ఇటీవలే సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించడం జరిగింది.


ఇంకా దీనికి సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.ఇక ఆర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు పా. రంజిత్‌నే దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ఇంకా ప్రకటించలేదు. కానీ దాదాపుగా మొదటి భాగంలో నటించిన తారాగణమే ఈ మూవీలో కనిపించే అవకాశం ఉంది. ప్రస్తుతం విక్రమ్ హీరోగా పా. రంజిత్ తెరకెక్కిస్తున్న 'తంగలాన్' సినిమా విడుదలకు రెడీ అవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీని వేసవిలో చేయబోతున్నారు.ఇక 'తంగలాన్' సినిమా రిలీజ్ తర్వాత డైరెక్టర్ రంజిత్ 'సార్పట్టా 2' ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించి ఆసక్తికర అప్డేట్స్ బయటికి వచ్చాయి. డైరెక్టర్ పా. రంజిత్ సార్పట్టా సీక్వెల్ కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా స్టార్ట్ చేశారట.మొదటి భాగం కంటే  ఎక్కువ బడ్జెట్ తో సీక్వెల్ ని రూపొందిస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: