ప్రశాంత్ నీల్ దెబ్బేసాడు.. తారక్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్?

praveen
కే జి ఎఫ్ అనే సినిమాతో ప్రశాంత్ నిల్ తన డైరెక్షన్ సత్తా ఏంటో అందరికీ నిరూపించాడు. ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కన్నడ హీరో యశ్ ను పాన్ ఇండియా హీరోగా మార్చడమే కాదు.. ఇక ప్రశాంత్ నీల్ ని కూడా అన్ని భాషల ప్రేక్షకులకు సుపరిచితుడుగా మార్చేసింది ఈ మూవీ. అయితే కేజిఎఫ్ లాంటి సెన్సేషనల్ విజయం తర్వాత ప్రశాంత్ దర్శకత్వంలో వచ్చిన సినిమా సలార్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి.

 అయితే గత ఏడాది డిసెంబర్ 22వ తేదీన ఎంతో గ్రాండ్గా ఈ సినిమా రిలీజ్ అయింది అని చెప్పాలి. ప్రేక్షకులు ఊహించిన దాని కంటే ఎంతో అద్భుతంగా ప్రభాస్ ని చూపించడంలో సక్సెస్ అయ్యాడు ప్రశాంత్ నీల్. దీంతో ఈ డైరెక్టర్ టేకింగ్ కి డార్లింగ్ అభిమానులు అందరూ కూడా ఫిదా అయిపోయి సలాం కొట్టేశారు. ఇక ప్రభాస్ కూడా దాదాపు ఆరేళ్ల గ్యాప్ లో వరుస ప్లాపుల తర్వాత సలార్ మూవీతో ఒక సాలిడ్ హిట్టు కొట్టాడు అని చెప్పాలి. అయితే సలార్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడట.

 ఇక ప్రశాంత్ నీల్ తీసుకున్న నిర్ణయంతో తారక్ అభిమానులందరికీ కూడా ఊహించని షాక్ తగలబోతుంది అన్నది తెలుస్తుంది. సలార్ ముగిసిన వెంటనే తారక్ తో ప్రశాంత్ నీల్ సినిమా చేయాల్సి ఉంది. కానీ సలార్ మూవీ సూపర్ హిట్ కావడంతో ఇక వెయిట్ చేయకుండా పార్ట్ 2 ని కూడా తెరకెక్కించాలని అనుకుంటున్నాడట ఈ డైరెక్టర్. సలార్ ఫీవర్ ఇలాగే కంటిన్యూ చేసి త్వరగా రెండో పార్ట్ ను కూడా విడుదల చేస్తే సెన్సేషన్ విజయాన్ని సాధించవచ్చు అని అనుకుంటున్నాడట ప్రశాంత్ నీల్. దీంతో ఎన్టీఆర్ మూవీని పక్కన పెట్టే ఆలోచన చేస్తున్నాడు అన్నది తెలుస్తుంది. ఇది డార్లింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అయినా తారక్ ఫ్యాన్స్ కి మాత్రం నిజంగా బాడ్ న్యూస్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: