జెర్సీ తర్వాత.. అందుకే తెలుగు సినిమాలు చేయలేదు : శ్రద్ధ శ్రీనాథ్

praveen
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చినవారు ఒక్క హిట్టు కొట్టారు అంటే చాలు ఇక ఇండస్ట్రీలో పాతుకుపోవాలని ఆలోచిస్తూ ఉంటారు. ఇక హిట్టు కొట్టారు అంటే అందుకు తగ్గట్లుగానే వారికి ఆఫర్లు కూడా వస్తూ ఉంటాయి. ఇక ఇలాంటి ఆఫర్లను అందిపుచ్చుకుంటూ స్టార్ హీరోయిన్గా ఎదుగుతూ ఉంటారు ఎంతోమంది నటీమణులు. అయితే కొంతమంది మాత్రం ఎందుకో అవకాశాలు వచ్చిన పెద్దగా పట్టించుకోరు. అలాంటి వారిలో శ్రద్ధ శ్రీనాథ్ కూడా ఒకరు అని చెప్పాలి. నాని హీరోగా నటించిన జెర్సీ సినిమా ఎంత మంచి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 అయితే ఈ మూవీలో నాని భార్యగా నటించింది శ్రద్ధ శ్రీనాథ్. ఇక తన అందం అభినయంతో తెలుగు కుర్ర కారు మతి పోగొట్టుకుని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆ తర్వాత మాత్రం ఎక్కడ తెలుగులో కనిపించలేదు శ్రద్ధ. ఇక సంక్రాంతికి విడుదలవుతున్న వెంకటేష్ సైంధవ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించింది. అయితే ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న శ్రద్ధకు జెర్సీ తర్వాత ఎందుకు సినిమాలు చేయలేదు అన్న ప్రశ్న ఎదురవగా.. ఆసక్తికర సమాధానం చెప్పింది. నాకు స్క్రిప్ట్ నచ్చకపోతే ఏ సినిమా కూడా చేయను.

 నా స్టాండర్డ్స్ చాలా ఎక్కువ. జెర్సీ తర్వాత నేను ఏదైనా సినిమా చేస్తున్నానంటే అది జెర్సీతో సమానంగా మంచి సినిమా కావాలని.. లేదంటే అంతకంటే ఎక్కువ మంచి సినిమా కావాలని నేను అనుకుంటాను. అందుకే జెర్సీ తర్వాత నాకు చాలా ఆఫర్లు వచ్చిన ఏ సినిమాను కూడా ఒప్పుకోలేదు. చివరికి సినిమాల్లో తల్లిగా నటించడం కూడా నాకు సమ్మతమే. అసలు తల్లి పాత్ర మాత్రమే అయితే నేను అలాంటి పాత్రలు చేయను. నేను ఎంచుకోవడానికి అనేక పరిశ్రమలు ఉన్నాయి. నాకు ఎప్పుడూ పని ఉంటుంది. కానీ నేనెప్పుడూ అలాంటి వ్యక్తిని కాదు. ఇప్పుడు లెవెల్ ఆఫ్ కావలసిన సమయం వచ్చింది అంటూ శ్రద్ధ శ్రీనాథ్ చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: