మహేష్ సినిమా కోసం.. ఆ హీరోయిన్ ని తీసుకోవాలని జక్కన్న పట్టుపట్టాడట?

praveen
సంక్రాంతి వచ్చింది అంటే చాలు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర ఉండే సందడి అంతా ఇంతా కాదు. టాలీవుడ్ లో ఉన్న బడా హీరోలు అందరూ కూడా తమ సినిమాలను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఎంతగానో ఆశపడుతూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ముందుగానే డేట్ ఫిక్స్ చేసుకొని మరి ఇక సంక్రాంతి బరిలో దిగుతూ ఉంటారు. ఈ క్రమంలోనే కొంతమంది హీరోలు ఇలా సంక్రాంతికి వచ్చి భారీ హిట్లు కొడుతుంటే.. మరి కొంతమంది హీరోల సినిమాలు మాత్రం అభిమానులను నిరాశ పరుస్తూ ఉంటాయి.

 అయితే ఎప్పటిలాగానే ఈ సంక్రాంతి బరిలో కూడా ఎంతోమంది బడా హీరోలు సినిమాలు ఉన్నాయి. అదే సమయంలో కొంతమంది చోటా హీరోలు కూడా వెనక్కి తగ్గకుండా సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకేకుతున్న గుంటూరు కారం సినిమా కూడా ఈ సంక్రాంతి పండక్కి ప్రేక్షకులను పలకరించబోతుంది అని చెప్పాలి. అయితే ఇక మహేష్ తర్వాత మూవీ రాజమౌళితో చేయాల్సి ఉంది. ఇక ఈ మూవీ కోసం అభిమానులు అందరూ కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని కళ్ళు కాయలు కాసేలా నిరీక్షణగా చూస్తున్నారు.

 అయితే ఈ మూవీ గురించి ఒక అదిరిపోయే న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది. ఏకంగా మార్చి నెలలో ఈ సినిమాను పూజ కార్యక్రమాలతో ప్రారంభించాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. ఆఫ్రికా లోని అమెజాన్ అడవుల బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ థ్రిల్లర్గా ఈ సినిమా సాగుతుందని తెలుస్తుంది. విజయేంద్ర ప్రసాద్ రాసిన కథలో హీరోయిన్ పాత్ర చాలా కీలకమట. ఈ క్రమంలోనే ఈ మూవీ కోసం బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తే బాగుంటుందని మేకర్స్ అనుకుంటున్నారట. ఇప్పటికే జక్కన్న ప్రియాంక చోప్రా తో రెండుసార్లు చర్చలు కూడా జరిపాడట. ఇక ఎట్టి పరిస్థితుల్లో ప్రియాంకను ఒప్పించి సినిమాలోకి తీసుకోవాలని అనుకుంటున్నారట. అయితే రాజమౌళి సినిమా అంటే ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే. ఇక ప్రియాంక చోప్రా కూడా ఒప్పుకునే ఛాన్సలే ఎక్కువగా ఉన్నాయని అందరూ అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: