మెగా హీరో మూవీని లాక్ చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ....!!

murali krishna
ఆపరేషన్ వాలెంటైన్ సినిమా టీజర్ ఆకట్టుకునేలా ఉంది. టీజర్ నేడు (డిసెంబర్ 18) రిలీజ్ కాగా.. మంచి రెస్పాన్స్ వస్తోంది.టెక్నికల్‍గానూ ఈ టీజర్ అద్భుతంగా ఉంది. వైమానిక దాడి ప్రధాన అంశంగా రూపొందుతున్న ఈ చిత్రంలో యుద్ధ విమానాల విన్యాసాలు అబ్బురపరిచేలా ఉండనున్నాయని టీజర్ చూస్తే తెలుస్తోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఆపరేషన్ వాలెంటైన్ చిత్రంలో బాలీవుడ్ నటి మానుషి చిల్లర్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. 2024 ఫిబ్రవరి 16న ఈ చిత్రం రిలీజ్ కానుంది. కాగా, నేడు రిలీజ్ అయిన టీజర్ ద్వారా ఈ మూవీ ఓటీటీ హక్కులను ఏ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుందో వెల్లడైంది.ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్‌నర్ అప్పుడే ఖరారైంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్ దక్కించుకుంది. నేడు రిలీజ్ అయిన టీజర్ ద్వారా ఈ విషయం వెల్లడైంది. స్ట్రీమింగ్ పార్ట్‌నర్ ప్రైమ్ వీడియో అని మేకర్స్ టీజర్ ద్వారా పేర్కొన్నారు.

ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ఫిబ్రవరి 16వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్‍ఫామ్‍లోకి అడుగుపెట్టనుంది.ఆపరేషన్ వాలెంటైన్ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ హడ దర్శకత్వం వహిస్తున్నారు. ఎయిర్ స్ట్రైక్ ఆపరేషన్‍కు హెడ్‍గా కెప్టెన్ రుద్ర పాత్రను ఈ మూవీలో చేశారు వరణ్ తేజ్. హీరోయిన్ మానుషి చిల్లర్ కూడా ఈ ఆపరేషన్‍లో ఉంటారు. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్లుగా పని చేసే ఇద్దరూ ప్రేమలో పడినట్టు టీజర్లో ఉంది. లవ్ స్టోరీ కూడా ఈ సినిమాలో ప్రధానంగా ఉండేలా కనిపిస్తోంది.

ఆపరేషన్ వాలెంటైన్ సినిమాకు హరి కే వేదాంతం సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. టీజర్లో విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసెన్స్ పిక్చర్స్ బ్యానర్లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీల్లో ద్విభాషా చిత్రంగా ఆపరేషన్ వాలెంటైన్ తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్‍తోనే ఈ మూవీ రూపొందుతోంది.ఆపరేషన్ వాలెంటైన్ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు. "మన దేశం గాంధీజీతో పాటు సుభాష్ చంద్రబోస్‍ది కూడా" అనే డైలాగ్ టీజర్లో హైలైట్‍గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: