'సలార్' మూవీ టికెట్ ను భారీ ధర పెట్టి కొన్న స్టార్ డైరెక్టర్....!!

murali krishna
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడప్పుడా అంటూ ఎదురుచూస్తున్న తరుణం దగ్గర పడుతుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సలార్ రిలీజ్ కి రెడీ అయ్యింది.మరో ఆరు రోజుల్లో మూవీ రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమా టికెట్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఎప్పుడు కొనుగోలు చేద్దామా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. అయితే మూవీ తొలి టికెట్ ని భారీ ధరకి రాజమౌళి సొంతం చేసుకున్నారట.ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి హోస్టుగా ఒక ఇంటర్వ్యూ చేస్తున్నారట. ఈ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్, ప్రభాస్, పృథ్వి రాజ్ సుకుమారన్ పాల్గొనున్నారట. ఇక ఈ ఇంటర్వ్యూలోనే రాజమౌళి సలార్ తొలి టికెట్ ని కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. రాజమౌళి రూ.10,116 పెట్టి సలార్ తొలి టికెట్ ని సొంతం చేసుకున్నారట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే ఇంటర్వ్యూ రిలీజ్ అయ్యేవరకు వేచి చూడాలి.ఆ ఇంటర్వ్యూ కోసం అభిమానులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ ని ఒక షోలో చూసి చాలా కాలం అవుతుంది. దీంతో ఫ్యాన్స్ ఈ ఎపిసోడ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. కాగా సలార్ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా, పృథ్వి రాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్స్‌గా నటిస్తున్నారు. ఇక ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ని ఈ నెల 22న రిలీజ్ చేయనున్నారు.కాగా ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ టీం.. ఇప్పటికే ఒక ట్రైలర్ అండ్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ రెండు యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ సృష్టిస్తున్నాయి. సినిమా రిలీజ్ లోపు మరో సాంగ్ అండ్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయనున్నారట. ఈ ట్రైలర్ యాక్షన్ కట్ తో ఉండబోతుందట. మరి ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: