ఆ రెండు సినిమాలపై ఫైర్ అవుతున్న ఎంపీ...!!
ఆమె మాట్లాడుతూ యానిమల్ చిత్రంలో మహిళల పట్ల హింస దారుణంగా ఉంది. చాలా అసభ్యంగా చిత్రీకరించారు. ఇలాంటి సినిమాలు సమాజంపై ప్రభావాన్ని చూపించగలవు. యానిమల్ మూవీ చూసి న కూతురు ఏడ్చేసింది. ఆ మూవీలో హింస, వల్గారిటీ తారా స్థాయిలో ఉన్నాయి అంటూ రంజీత్ రంజన్ దుమ్మెత్తిపోశారు. నా కూతురు యానిమల్ చిత్రానికి వెళ్ళింది.. కానీ ఏడుస్తూ మధ్యలో వచ్చేసింది.యువతపై ప్రభావం చూపే ఇలాంటి చిత్రాలు అవసరం లేదు అని ఆమె వాదించారు. ఇలాంటి చిత్రాలని ప్రభుత్వాలు ప్రోత్సహించడం కాదు కదా బ్యాన్ చేయాలి అని అన్నారు. పనిలో పనిగా ఆమె పుష్ప చిత్రాన్ని కూడా లేవనెత్తారు. సిక్కు వీరులు బ్రిటిష్ వారిపై పోరాటం చేసిన పాటని యానిమల్ లో హింస కోసం వాడుకున్నారు. ఇలాంటి చర్యలని ఏమాత్రం సహించకూడదని రంజీత్ రంజన్ అభిప్రాయ పడ్డారు. యానిమల్ రచ్చ రాజ్యసభ వరకు వెళ్ళింది. ఇంకెంత దూరం వెళుతుందో చూడాలి.