ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్ధం అవుతున్న సల్లుభాయ్ మూవీ....!!

murali krishna
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ 3.ఈ మూవీ లో కత్రినా కైఫ్ సల్మాన్ సరసన హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాను యశ్ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో  తెరకెక్కించింది. ఈ సినిమా దీపావళి సందర్భంగా నవంబర్ 12న థియేటర్లలో రిలీజైంది.మనీష్ శర్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి తొలి రోజు మిక్స్డ్ టాక్ వచ్చింది. టైగర్ ఫ్రాంఛైజీలో వచ్చిన మూడో సినిమా కావడంతో టైగర్ 3 భారీ అంచనాల మధ్య రిలీజైంది. పైగా ఈ సినిమాలో షారుక్ ఖాన్ మరియు హృతిక్ రోషన్ గెస్ట్ రోల్స్ లో కనిపించారు.టైగర్ 3 మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్లకుపైగా వసూలు చేసింది. ఈ సినిమా రెండో రోజుల్లోనే ఇండియాలో రూ.100 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది..కానీ తర్వాత మెల్ల మెల్లగా కలెక్షన్స్ తగ్గుతూ వచ్చాయి. ఈ సినిమా తెలుగులో కూడా భారీ స్థాయిలో రిలీజ్ అయినా కూడా ఇక్కడి ప్రేక్షకులు టైగర్ 3 ని పెద్దగా ఆదరించలేదు. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్ గా నటించారు.బాలీవుడ్‍లో ప్రస్తుతం బాక్సాఫీస్ కలెక్షన్స్ పై చర్చ సాగుతోంది. షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన పఠాన్ మరియు జవాన్ సినిమాలు ఈ ఏడాది రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించాయి. దీంతో సల్మాన్ ఖాన్.. టైగర్ 3 కూడా ఆ రేంజ్‍లో వసూళ్లను రాబడుతుందని అభిమానులు అంతా అంచనాలు వేశారు. కానీ ఈ మూవీ అందులో సగం కూడా వసూలు చేయలేకపోయింది. అయితే తాను బాక్సాఫీస్ నంబర్లను పెద్దగా పట్టించుకోనని సల్మాన్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే టైగర్ 3 మూవీ ఓటీటీ విడుదలకు సిద్ధం అయింది..ఈ సినిమా థియేటర్స్ లో విడుదల అయిన సరిగ్గా నెల రోజుల తర్వాత అంటే డిసెంబర్ 12న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని తెలుస్తుంది. మరి ఓటీటీ ప్రేక్షకులను టైగర్ మెప్పిస్తాడో లేదో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: