తన సీక్రెట్ ను రీవీల్ చేసిన హాట్ బ్యూటీ....!!
ఇక రంగస్థలం, పుష్ప, క్షణం లాంటి చిత్రాలు అనసూయకి నటిగా మంచి క్రేజ్ తీసుకువచ్చాయి. అనసూయ చివరగా పెదకాపు చిత్రంలో నటిచింది. ఇప్పుడు పుష్ప 2, మరికొన్ని చిత్రాలతో బిజీగా ఉంది.వచ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఒకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె చాలా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఉండాలి. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ తో ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది. అనసూయ తరచుగా ఫ్యామిలీతో వెకేషన్స్ కి వెళుతూ ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో షేర్ చేయడం చూస్తూనే ఉన్నాం.ఇక అనసూయ లాంటి టాప్ గ్లామర్ యాంకర్ కి షాపింగ్ మాల్ ఓపెనింగ్స్, ఇతర వాణిజ్య కార్యక్రమాలు వస్తూనే ఉంటాయి. సినీ తారలు ఈ రకమైన ప్రకటనలతో బాగానే సొమ్ము చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇటీవల రాయచోటిలో షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్లిన అనసూయ.. తాజాగా షాద్ నగర్ లో మరో మాల్ ఓపెనింగ్ కి వెళ్ళింది.
దీనితో ఆ ప్రాంతం జనజాతరని తలపించేలా మారింది. అనసూయ రాగానే ఆమెపై డ్రోన్ తో పూల వర్షం కురిపించారు. అభిమానుల కేరింతలతో ఆ ప్రాంతం కోలాహలంగా మారింది. అనసూయ ని చూడగానే యువత కేరింతలు కొట్టారు.షాపింగ్ మాల్ ఓపెనింగ్ తర్వాత అనసూయ అక్కడున్న జనాన్ని, అభిమానులని ఉద్దేశించి మాట్లాడింది. షాద్ నగర్ అంటే తనకు ప్రత్యేకంగా చాలా ఇష్టం అని పేర్కొంది. క్షణం చిత్ర క్లైమాక్స్ ని ఇక్కడే షూట్ చేశాం.ఆ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. అలాగే మా ఆయనతో కలసి నేను అప్పుడప్పుడూ ఇక్కడకి వస్తుంటా. ఎందుకంటే ఇక్కడ మాకు ల్యాండ్స్ ఉన్నాయి అంటూ ఆస్తుల సీక్రెట్ బయట పెట్టింది. షాద్ నగర్ లో డాబా ఫుడ్ అంటే కూడా తనకి ఇష్టం అని అనసూయ పేర్కొంది.