సినీ నటి
శృతిహాసన్ ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈమె నటించిన సలార్
సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.ఈ
సినిమా కోసం
శృతిహాసన్ ప్రభాస్ అభిమానులు ఇద్దరు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈమె మొదటిసారి
ప్రభాస్ తో కలిసి సలార్ సినిమాలో నటించారు. ఈ
సినిమా డిసెంబర్ 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక
శృతిహాసన్ ఈ సినిమాతో పాటు పలు సినిమాలలో కూడా బిజీగా ఉన్నారు.ఇక కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే
శృతిహాసన్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తరచూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు ఇకపోతే తాజాగా ఈమె తన ఒంటిపై ఉన్నటువంటి టాటూలు అన్ని కనిపించేలా ఫోటోలకు హాట్ ఫోజులు ఇచ్చారు. బ్లాక్ కలర్ డ్రెస్ లో దిగినటువంటి ఈ ఫోటోలను ఈమె సోషల్
మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.ఇలా ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడమే కాకుండా ఈమె తన గురించి ఆసక్తికరమైనటువంటి పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా
ఇంస్టాగ్రామ్ వేదికగా
శృతిహాసన్ స్పందిస్తూ.. ఇకపై అన్ని విషయాలను మర్చిపోయి బయటకు రావాలని కోరుకుంటున్నానని, అలాగే ఇకపై (Sruthi Haasan) తాను లేచి నిలబడటం నేర్చుకుంటున్నానని
శృతిహాసన్ తెలియజేశారు.ఇకపై తాను ఏమి చెప్పాలనుకున్నా కూడా తన స్టైల్ లోనే చెబుతానని నా దారి రహదారి లేదా హైవే అంటూ ఈ సందర్భంగా
శృతిహాసన్ చేసినటువంటి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈమె చేసినటువంటి ఈ పోస్ట్ ఉద్దేశం ఏంటి అనే విషయంపై నేటిజన్స్ ఆరా తీస్తున్నారు. ఈమె చేసిన పోస్ట్ కు అర్థం ఏంటి? ఏ విషయంలోనైనా మోసపోయారా అందుకే ఇలాంటి పోస్ట్ చేశారా అంటూ పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.