టాలీవుడ్ ఇండస్ట్రీ లో మెగాస్టార్ అనే పేరు వినగానే ఫ్యాన్స్ లో వచ్చే పూనకాలే వేరు మరీ ఆయన అలాంటి క్రేజ్ ను సంపాదించారు. అయితేచిరంజీవి సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. చిరంజీవి నటించిన "మృగరాజు" సినిమా గురించి ఒక వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.అగ్ర హీరో లతో సినిమాలంటే బడ్జెట్ ఎక్కువే పెట్టాలి. హంగూ ఆర్భాటాలు ఉండాలి. సెట్స్ కి భారీగా ఖర్చుపెట్టాలి. లుక్స్ అదిరిపోవాలి. ఇక సాంగ్స్, ఫైట్స్ సరేసరి. ఇంతా ఖర్చు పెట్టాక ఆ సినిమా డిజాస్టర్ అయిందంటే ఇక ప్రొడ్యూసర్ పని అయిపో యినట్లే. సినిమా అంటేనే రిస్క్ కదా. ఇక వరుస విజయాల తో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు తీసిన మృగరాజు మూవీ దారుణం గా ప్లాప్ అయింది. ఇద్దరు హీరోయిన్స్ లో సోనాలి బింద్రే ను హీరోయిన్ గా అనుకుంటే కొన్ని కారణాల వలన కుదరలేదు.
దాంతో సిమ్రాన్, సంఘవి నటించిన ఈ మూవీని అడవి బ్యాక్ డ్రాప్ తో గుణశేఖర్ తెరకెక్కించారు. నాగబాబు కీలక పాత్ర పోషించాడు. మణిశర్మ మ్యూజిక్ అందించారు. భారీ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా లో సింహం కోసమే చాలా ఖర్చు పెట్టారట. చిరంజీవి తో దాదాపు ఆరు హిట్ మూవీస్ తీసిన కె దేవి వరప్రసాద్ నిర్మించారు.హాలీవుడ్ లో నటించిన జాక్ సింహం ఈ మూవీ కోసం రప్పించారు. సింహం చిరంజీవి నడుమ దాదాపు 26రోజులు షూటింగ్ చేసారు. చిరంజీవి అయితే రోజుకి 20 గంటలపాటు కష్టపడ్డారు. ఏకంగా 150రోజులు ఈ సినిమా షూటింగ్ కోసం చిరంజీవి డేట్స్ ఇచ్చి నటించారు. చాయ్ వాలా సాంగ్ ఆకట్టుకున్నా, సినిమా డిజాస్టర్ గా మిగిలింది. అయితే ఇందు లో సింహం కోసం దాదాపు 67లక్షలు వెచ్చించారట