నరసింహ సినిమాలో.. నీలాంబరి పాత్రను రమ్యకృష్ణ వద్దనుకున్నారట తెలుసా?

praveen
సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు తన నటనతో ఇప్పటికే ప్రేక్షకుల మదిలో ప్రత్యేకమైన ముద్ర వేసుకుంది ఈ నటి గ్లామర్ వలకబోయాలన్న పవర్ఫుల్ పాత్రలోనటించి ఆశ్చర్యపరచాలన్న ఏకంగా స్టార్ హీరోలను సైతం ఢీకొట్టే విలన్ పాత్రలో నటించాలి అన్న ఇక అందుకు రమ్యకృష్ణను మించిన వారు ఇంకొకరు లేరు అనడంలో సందేహం లేదు. ఎలాంటి పాత్రలోకైనా సరే పనకాయ ప్రవేశం చేసి.. ఇక సినీ ప్రేక్షకులందరికీ కూడా తన నటనతోదాసోహం అయ్యేలా చేస్తూ ఉంటుంది రమ్యకృష్ణ.

 ఇప్పుడు వరకు ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలో నటించి ఇక అప్పట్లో అగ్ర హీరోయిన్గా చక్రం తిప్పిన రమ్యకృష్ణ ఇక ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా అంతే బిజీగా మారిపోయింది అయితే రమ్యకృష్ణ అభిమానులు అందరికీ కూడా ఆమె కెరియర్లో బాగా గుర్తుండిపోయే పాత్రలు చాలానే ఉన్నాయి. ఇలాంటి పాత్రలలో నరసింహ మూవీ లోని నీలాంబరి పాత్ర కూడా ఒకటి అని చెప్పాలి ఈ సినిమాలో నీలాంబరి అనే ఒక విలన్ పాత్రలో ఆమె చూపించిన విలనిజం అందరినీ అవాకయ్యేలా చేసింది. ఒకరకంగా చెప్పాలంటే నరసింహ  సినిమా పేరు తీయగానే అందరికీ రజనీకాంత్ కంటే ముందుగా రమ్యకృష్ణ పాత్ర గుర్తుకు వస్తూ ఉంటుంది.

 అంతలా రమ్యకృష్ణ ఆ పాత్రకు ప్రాణం పోసింది. కానీ ఇలా తనకు ఎంతగానో పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చిన నీలాంబరి పాత్రను రమ్యకృష్ణ ముందు చేయాలని అనుకోలేదట. ఆ పాత్ర చేయడానికి ఇష్టం లేక ముందుగా ఇక నో చెప్పాలని అనుకున్నారట రమ్యకృష్ణ. ఈ విషయాన్ని ఓ సందర్భంలో అభిమానులతో పంచుకున్నారు ఆమె. ఆ సినిమాలో నేను చాలా పొగరుతో నటించాల్సి ఉంది. అలాంటి తల పొగురుతో ప్రవర్తించడం నాకు ఇష్టం ఉండదు. అయితే అది సినిమాలో ఒక పాత్ర అని నాకు తెలుసు. కానీ అలా ప్రవర్తిస్తూ నటించడానికి మొదట్లో మనసు ఒప్పుకోలేదు. పాత్ర చేయకూడదు అనుకున్నాను. ఒకవేళ దర్శకుడు అడిగి ఉంటే నేను సౌందర్య పాత్రనే కావాలని కోరుకునేదాన్ని. కానీ దర్శకుడు నన్ను నమ్మి ఇక విలన్ పాత్రను అప్పు చెప్పాడు అంటూ రమ్యకృష్ణ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: