వేరువేరుగా ఆ ఇద్దరి సన్నివేశాలను తెరకెక్కిస్తున్న "గుంటూరు కారం" మూవీ బృందం..?

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి ... శ్రీ లీలా హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీలో రమ్యకృష్ణ ... జయరామ్ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఇకపోతే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే.


సినిమా విడుదల తేదీ ఇప్పటికే దగ్గర పడింది అయినప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ చాలా భాగం పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ ని కచ్చితంగా సంక్రాంతి కి విడుదల చేయాలి అని ఈ చిత్ర బృందం డిసైడ్ అవడంతో ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ ను చాలా స్పీడ్ గా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ షూటింగ్ ను చాలా స్పీడ్ గా పూర్తి చేయాలి అనే ఉద్దేశంతో ఈ మూవీ బృందం రమ్యకృష్ణ పై ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలను రూపొందిస్తున్న సమయం లోనే వేరే చోట జయరామ్ పై కూడా కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఇలా మహేష్ బాబు లేని సన్నివేశాలను ఒకే సారి వేరు వేరు చోట్ల ఈ చిత్ర బృందం చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.


ఇలా ఈ మూవీ షూటింగ్ ను చాలా స్పీడ్ గా రూపొందించి ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కి విడుదల చేయాలి అని ఈ చిత్ర బృందం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న మహేష్ నటిస్తున్న మూవీ కావడం ... అలా వైకుంఠపురంలో సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన మూవీ కావడంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నిలకొని ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: