'మిర్చి' మూవీ ను మిస్ చేసుకున్న మాస్ మహారాజ్...!!

murali krishna
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్లు అద్భుతంగా సినిమాలు తీసి ప్రేక్షక దేవుళ్లను సైతం మెప్పించిన డైరెక్టర్లు ఎందరో ఉన్నారు ఇప్పటికీ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఫామ్ లో ఉన్న డైరెక్టర్లు అందరూ కూడా సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు.ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్న కొరటాల శివ మొదటి సినిమా అయిన మిర్చి సినిమాని ప్రభాస్ తో చేయడం జరిగింది.ఈ సినిమా ని మొదటగా రవితేజతో చేద్దామని అనుకున్నప్పటికీ రవితేజ ఇంతకుముందు చేసిన భద్ర సినిమా కూడా కొంచం ఇలాంటి స్టోరీ నే కావడంతో రవితేజ ఈ స్టోరీ ని రిజక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది.

అయితే కొరటాల శివ భద్ర సినిమాకి మాటలను అందించడం జరిగింది. ఇక ఆ చనువుతోనే రవితేజ కి కథ చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే రవితేజ రిజెక్ట్ చేసిన తర్వాత ఈ సినిమా స్టోరీ ని తీసుకెళ్ళి ప్రభాస్ కి చెప్పడం జరిగింది.ప్రభాస్ కి ఈ కథ నచ్చినప్పటికి అంతకు ముందే ప్రభాస్ బాహుబలి సినిమా కమిట్ అయిపోవడం సినిమా చేయాలా, వద్దా అని రాజమౌళి దగ్గర క్లారిటీ తెలుసుకొని బాహుబలి సినిమాకి ఇంకా కొంచెం టైం పడుతుంది అని రాజమౌళి చెప్పడంతో ఆ గ్యాప్ లో మిర్చి సినిమా చేయడం జరిగింది.   ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆ తర్వాత మహేష్ బాబుని హీరోగా పెట్టి శ్రీమంతుడు అనే సినిమా చేశాడు.ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ని హీరోగా పెట్టి జనతా గ్యారేజ్ అనే సినిమా చేశాడు ఇది కూడా సూపర్ సక్సెస్ అవ్వడంతో కొరటాల శివ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ఆయన దేవర సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: