టైగర్ -3 ట్రైలర్ పాన్ ఇండియా రేంజ్ లో వచ్చేది ఆరోజే..!!

Divya
సల్మాన్ ఖాన్ హీరోగా, కత్రినా కైఫ్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం టైగర్-3 ఎస్ రాజ్ ఫిలిం పతాకం పైన ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా ట్రైలర్ గురించి అభిమానుల సైతం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అక్టోబర్ 16వ తేదీన ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారుఈ. ఏడాది దీపావళి కానుకగా ఈ సినిమానే విడుదల చేయబోతున్నట్లు టైగర్-3 చిత్ర బృందం ఇదివరకే ప్రకటించింది. ఎస్ రాజ్ ఫిలిం నుంచి వస్తున్న స్పై సినిమా అంటేనే అభిమానులలో ప్రేక్షకులలో బాగా ఆసక్తి పెరిగిపోతుంది.


ఇప్పటికే ఎన్నో సినిమాలు క్రియేట్ చేసి మంచి విజయాలను అందుకున్నారు .టైగర్ -3 సినిమా మరింత పగడ్బందీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇండియాలోనే మునిపెన్నడు లేని విధంగా యాక్షన్స్ సన్నివేశాలు ఇందులో చూపించబోతున్నట్లు సమాచారం.. ఏక్ధా టైగర్ , టైగర్ జిందా హై సినిమాలో సాధించిన సక్సెస్ చూసిన తర్వాతే ఆదిత్య చోప్రాకి ఈ జోనర్ మీద చాలా నమ్మకం ఏర్పడి ఈ సినిమాను చేసినట్లుగా తెలుస్తోంది. అలా హృతిక్ రోషన్ నటించిన వార్ సినిమాతో పాటు .. షారుఖ్ ఖాన్ నటించిన పటాన్ సినిమా కూడా అలాగే పుట్టినట్లు తెలుస్తోంది.


పఠాన్ సమయంలోనే స్పై యూనివర్సిటీ గురించి మరొక ఫ్రాన్స్చేసి లోగోని  సైతం ప్రకటించారు ఆదిత్య చోప్రా. యూనివర్సిటీలలో క్రాస్ ఓవర్ క్యారెక్టర్ల గురించి సైతం పఠాన్ సినిమా సమయంలోనే ప్రకటించడం జరిగింది. సల్మాన్ ఖాన్ ని ,షారుక్ ఖాన్ యాక్షన్ సీన్స్ లలో పటాన్ స్క్రీన్ మీద చూపించారు. ఎస్ రాజ్ ఫిలిం బ్యానర్ పైన తెరకెక్కించిన సినిమాలోని వీరిద్దరి కాంబినేషన్ ఉండబోతుందని వార్తలు వినిపించాయి. మరి టైగర్ త్రీ లో ఇలాంటి సన్నివేశం ఉంటుందా అనే విషయం తెలియాల్సి ఉన్నది. ఈ సినిమా నవంబర్ 10న థియేటర్లో విడుదల కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: