సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు అన్ని అడ్డంకులే ఏర్పడుతున్నాయి.ముఖ్యం గా హీరోయిన్ల విషయం లో కూడా పలు రకాల ఇబ్బందులు ఏర్పడడమే కాకుండా.. ఎప్పటి కప్పుడు గుంటూరు కారం సినిమా పైన పలు రూమర్లు వినిపిస్తూనే ఉంటాయి. ఈ సినిమా ఈ ఏడాది విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత వాయిదా పడుతూనే వస్తోంది.. ఎలాగైనా సరే ఈ సినిమా ని వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం మహేష్ బాబు ,త్రివిక్రమ్ కాంబినేషన్లో దాదాపు గా 12 ఏళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబి నేషన్లో వస్తున్న సినిమా కావడం తో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగం గా జరుగుతున్నట్లు తెలుస్తోంది. మహేష్ కు జోడి గా శ్రీ లీల నటిస్తూ ఉండగా మరొక హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. సంగీతాన్ని థమన్ అందిస్తూ ఉన్నారు. ఈ చిత్రం లో మహేష్ బాబు మాస్ హీరో గా కనిపించ బోతున్నట్లు ఇది వరకే విడుదలైన గ్లింప్స్ చూస్తే మనకి అర్థమవుతుంది.ఇదంతా ఇలా ఉంటే ఈ చిత్రం కోసం మహేష్ బాబు రెమ్యూనరేషన్ తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.. అయితే ఈ సినిమా కోసం దాదాపు గా 80 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మొత్తం ఈ సినిమా 200 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కాకపోయినా ఈ రేంజ్ లో రెమ్యూ నరేషన్ నిర్మాతలు ఇచ్చారంటే ఇక మహేష్ బాబు రేంజ్ ఏంటో చెప్పాల్సిన పనిలేదు.