మళ్లీ పట్టాలమీదికి ఎక్కబోతున్న పూరి జనగణమన..!!

Divya
డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా గతంలో జనగణమన సినిమా అని ప్రకటించడం జరిగింది..అయితే కొన్ని కారణాల చేత ఈ సినిమా ఆగిపోవడం జరిగింది. పూరి జగన్నాథ్ కెరియర్ లోనే ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలను సైతం తెరకెక్కించారు. బద్రి సినిమాతో మొదటి సారిగా సూపర్ హిట్ అందుకున్న పూరి జగన్నాథ్ ఆ తర్వాత వరుస సినిమాలు చేసి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. పూరి జగన్నాథ్ కెరీర్ లో ఎన్నో ఇండస్ట్రీ రికార్డును తిరగరాసే సినిమాలను కూడా తెరకెక్కించారు.

చివరిగా విజయ్ దేవరకొండ లైగర్ సినిమా తెరకెక్కించి పాన్ ఇండియా లెవెల్లో ఫెయిల్యూర్ డైరెక్టర్ గా పేరు సంపాదించారు. ఇక ఇప్పుడు రామ్ పోతునేని తో డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నది ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిస్తే జనగణమన అనే సినిమాని చేయాలనుకుంటున్నారట పూరి జగన్నాథ్. ఈ సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ముందుగా మహేష్ బాబుతో ఈ సినిమాని చేయాలనుకున్నారు.. ఆ తర్వాత కొన్ని కారణాల చేత విజయ్ దేవరకొండ తో చేయాలనుకున్నారు ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి హీరోయిన్గా పూజా హెగ్డే ను తీసుకోవడం జరిగింది.
కానీ లైగర్ సినిమా నిరాశపరచడంతో ఈ సినిమాని పక్కన పెట్టేశారు ఇప్పుడు మళ్లీ ఈ ప్రాజెక్టు పైన పలు రకాల వార్తను వినిపిస్తున్నాయి. ఈసారి హీరోగా, బాలీవుడ్ దర్శకులను ఎంపిక చేయబోతున్నట్లు తెలుస్తోంది.. బాలీవుడ్ హీరో తో ఈ సినిమాని చేయబోతున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంత నిజమో తెలియదు కానీ పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్టుని సైతం చాలా పగడ్బందీగానే తెరకెక్కించే పనిలో పడ్డారు పూరి జగన్నాథ్. ఇక తన నిర్మాణ సంస్థలోని ఈ సినిమాని కూడా తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: