తెలుగు
సినిమా ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న నిర్మాణ సంస్థలలో మైత్రి
మూవీ సంస్థ ఒకటి . ఇందులో నవీన్ యేర్నేని ఒక భాగస్వామి. ఇక పోతే ప్రస్తుతం వీరు
ఖుషి అనే
రొమాంటిక్ ఎంటర్టైనర్
మూవీ ని నిర్మించారు. ఈ
సినిమా లో
విజయ్ దేవరకొండ హీరోగా నటించగా ...
సమంత హీరోయిన్ గా నటించింది.
శివ నర్వణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు వశిం అబ్దుల్ వహీద్ సంగీతం అందించాడు . ఈ
మూవీ ని
అక్టోబర్ 1 వ తేదీని భారీ ఎత్తున తెలుగు ,
తమిళ ,
కన్నడ , మలయాళం ,
హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడడం తో తాజాగా ఈ
మూవీ బృందం భారీ ఎత్తున మ్యూజిక్ కాన్సెంట్ అనే
ఈవెంట్ ను నిర్వహించింది. ఇకపోతే ఈ
ఈవెంట్ లో ఈ
సినిమా సంగీత దర్శకుడు మరియు కొంత మంది ప్రముఖ సింగర్ లు లైవ్ లో పాటలు పాడి ప్రేక్షకులను అలరించగా ...
విజయ్ ...
సమంత లైవ్ లో డాన్స్ చేసి ప్రేక్షకులను అలరించారు .
ఇకపోతే ఈ
ఈవెంట్ లో భాగంగా మైత్రి
మూవీ సంస్థలో భాగస్వామి అయినటువంటి నవీన్ యేర్నేని మాట్లాడుతూ ... ఇప్పటివరకు
సమంత మైత్రి
మూవీ సంస్థలో జనతా గ్యారేజ్ ... రంగస్థలం ... పుష్ప సినిమాలలో నటించింది. ఈ మూడు
మూవీ లు కూడా అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. ఇకపోతే తాజాగా
సమంత మా బ్యానర్ లో
ఖుషి మూవీ లో నటించింది. ఈ
సినిమా కూడా
బ్లాక్ బస్టర్ విజయం సాధించి ఆ
మూవీ ల లిస్ట్ లో చేరిపోతుంది అని చెప్పుకొచ్చాడు.