వైరల్ గా మారిన మెగాస్టార్ చిరు కామెంట్స్....!!

murali krishna
మెగాస్టార్ చిరంజీవి శృతిహాసన్ హీరో హీరోయిన్లు గా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబి దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకు వచ్చినటు వంటి ఈ సినిమా 200 రోజుల ను పూర్తి చేసుకోవడం తో చిత్ర బృందం ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమం లో భాగం గా వాల్తేరు వీరయ్య చిత్ర బృందం పాల్గొన్నారు. అలాగే మాస్ మహారాజ రవితేజ కూడా ఈ కార్యక్రమం లో సందడి చేశారు.ఇలా ఈ కార్యక్రమం లో భాగంగా చిరంజీవి ఏపీ ప్రభుత్వం పై చేసినటువంటి కామెంట్స్ సంచలనం గా మారాయి.
ఈ మధ్యకాలం లో వైసిపి ప్రభుత్వం పవన్ కళ్యాణ్  ను భారీగా టార్గెట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇలా చిరంజీవి తన తమ్ముడి పట్ల వైసిపి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును గమనిస్తున్నటు వంటి మెగాస్టార్ సమయం దొరికినప్పుడు వైసీపీ ప్రభుత్వం పై సెటైర్స్ వేస్తూ ఉంటారు. అయితే తాజా గా బ్రో విషయం లో అంబటి రాంబాబు చేసినటు వంటి వ్యాఖ్యలు సంచలనం గా మారిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమం లోనే ఈ సినిమా 200 డేస్ సెలబ్రేషన్స్ లో భాగం గా చిరంజీవి ఏపీ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భం గా చిరంజీవి మాట్లాడుతూ మీలాంటి గొప్ప వాళ్ళు, పెద్దవాళ్లు ప్రత్యేక హోదా గురించి రోడ్ల నిర్మాణం గురించి ప్రాజెక్టుల గురించి, పేదవాడి కడుపు నింపే ఉద్యోగ ఉపాధి కల్పన గురించి ఆలోచించి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తే మేమంతా తలవంచి మీకు నమస్కారం చేస్తాము.అలా కాదని అభివృద్ధి ని గాలికి వదిలేసి పిచ్చుక పై బ్రహ్మాస్త్రం లాగా ఇండస్ట్రీ మీద పడతారేంటి..దీనిని ఓ పెద్ద సమస్యల చూపించకండి అంటూ ఈ సందర్భం గా చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: