సూర్య చిత్రం రీ రిలీజ్.. డిమాండ్ మామూలుగా లేదుగా..?

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ బాగానే కొనసాగుతోంది. స్టార్ హీరోల పాత సినిమాలన్నీ కూడా అభిమానులు ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ రిలీజ్ చేస్తూ ఉన్నారు.అయితే ఇప్పుడు స్టార్స్తో సంబంధం లేకుండా ప్రేక్షకు ఆదరణ పొందిన సినిమాలను కూడా రీ రీలీజ్ చేస్తూ బాగానే కలెక్షన్లు రాబడుతున్నారు.అలా కోలీవుడ్ హీరో సూర్య నటించిన 2008లో వచ్చిన సూర్య సన్నాఫ్ కృష్ణమూర్తి అనే ఒక క్లాసికల్ హిట్ సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో సూర్య తండ్రి కొడుకులుగా రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించారు.

మళ్లీ 15 ఏళ్ల తర్వాత ఈ చిత్రాన్ని తెలుగులో రీ రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాని ఎవరు చూస్తారులే అనే మాట అందరిలోనూ వినిపిస్తోంది.. కానీ ఎవరు ఊహించని విధంగా ఏకంగా 500 షోలు పడబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జరిగాయి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ సంబంధించి ప్రమోషన్స్ ను కూడా పెద్దగా చేయకపోయినప్పటికీ జనాలలో ఈ సినిమా టాక్ బాగా వెళ్లిపోయింది. ఈ కల్దు క్లాసికల్ సినిమా అప్పట్లో చూడలేని వారు ఇప్పుడు మళ్ళీ థియేటర్లోకి వెళ్లి చూడాలని ఆసక్తి చూపిస్తున్నారు.

డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఈ సినిమాని ఏ రేంజ్ లో తెరకెక్కించారు చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా ఇప్పటికీ టీవీలో వచ్చిన ఆసక్తిగా అభిమానులు చూస్తూ ఉన్నారు. తెలుగులో ఏకంగా ఏ సినిమా 500 షోలు పడడంతో దీనికున్న ఆదరణ ఏంటనే విషయం చెప్పవచ్చు. మరి మొదటి రోజు సూర్య సినిమా థియేటర్లో ఏవిధంగా ఆకట్టుకుంటుందో కలెక్షన్లు ఎలా సాధిస్తుందో అనే విషయం తెలియాలి అంటే మరో కొద్దిరోజులు ఆగాల్సిందే. సూర్య ప్రస్తుతం కంగువ అనే చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా దాదాపుగా పది భాషలలో పైగా విడుదల కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: