వైరల్ గా మారిన సినీ నటుడు పృథ్విరాజ్ కామెంట్స్....!!

murali krishna
పవన్ కళ్యాణ్ బ్రో మూవీ తాజా గా వివాదం లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అంబటి రాంబాబు ను ఇమిటేట్ చేయడం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.అయితే బ్రో సినిమా సక్సెస్ మీట్ లో పృథ్వీరాజ్మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదిక గా హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. అంబటి రాంబాబు ఎవరో నాకు తెలియదని పృథ్వీరాజ్ అన్నారు. శ్యాంబాబు రోల్ కు ఈ స్థాయిలో స్పందన వస్తుందని నాకు తెలియదని ఆయన తెలిపారు. నా క్యారెక్టర్ ఎందుకంత వైరల్ అయిందని సముద్రఖని అడిగారని పృథ్వీరాజ్ పేర్కొన్నారు. బ్రో మూవీలో మంచి ఉందని టైమ్ వాల్యూ, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ఈ రీజన్ వల్లే ఇంత కనెక్ట్ అయిందని చెప్పానని పృథ్వీరాజ్ పేర్కొన్నారు. టైమ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేమని పృథ్వీరాజ్ అన్నారు.

ఎంత సంపాదించినా చివరికి మట్టి లోకే వెళ్లాలని జీవించి ఉన్న సమయం లో ఆనందంగా ఉండాలని పృథ్వీరాజ్ పేర్కొన్నారు. నా పాత్ర పొలిటికల్ వివాదం అయిందని సినిమా చూసిన చాలామంది ఏపీ మంత్రిని డీగ్రేడ్ చేశారని అడుగుతున్నారని ఆ మంత్రి పేరు అంబటి రాంబాబని చెబుతున్నారని ఆయన ఎవరో నాకు తెలియదని పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలియని వ్యక్తి ని నేను ఇమిటేట్ చేయాల్సిన అవసరం ఏముందని ఆయన పేర్కొన్నారు. టైం లేదనకూడదని అహంకారం ప్రదర్శించకూడదని ఈ సినిమా ద్వారా నేను నేర్చుకున్నాని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు. పృథ్వీరాజ్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదిక గా వైరల్ అవుతున్నాయి. బ్రో సినిమా తర్వాత పృథ్వీరాజ్ కు సినిమా ఆఫర్లు పెరుగుతాయేమో చూడాల్సి ఉంది. పృథ్వీరాజ్ ను అభిమానించే వాళ్ల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. పృథ్వీరాజ్ వివాదాలకు దూరం గా ఉంటే మంచిదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: