హిడింబ చిత్రం తో అశ్విన్ మరొక సక్సెస్ సేనా..?

Divya
ప్రముఖ యాంకర్లలో ఒకరైన ఓంకార్ తన తమ్ముడు అశ్విన్ బాబు ప్రతి ఒక్కరికి సుపరిచితమే మొదట జీనియస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ నటుడు ఆ తర్వాత జతకలిసే , రాజు గారి గది, నాన్న నేను బాయ్ ఫ్రెండ్, రాజు గారి గది-2 , రాజు గారి గది -3 చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించారు.. తను నటించిన సినిమాలన్నీ కూడా బాగానే సక్సెస్ అయ్యాయి.. దీంతో తనకంటూ ఒక మార్కెట్ ఏర్పడింది. అయితే తను నటిస్తున్న తాజా చిత్రం హిడింబ ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదలై ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.


మిస్టర్ నూకయ్య వంటి డిఫరెంట్ సినిమాలను ఎక్కించిన డైరెక్టర్ కన్నెగంటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన అనిల్ సుంకర నిర్మించడం జరిగింది. ఈ రోజున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. అయితే నిర్మాతలు  హిడింబ చిత్రానికి అశ్విన్ మార్కెట్కు మించి ఖర్చుపెట్టినట్లుగా తెలుస్తోంది అయినప్పటికీ ఈ సినిమా టేబుల్ ప్రాపర్టీకి వచ్చినట్లు నిర్మాతలను ఒకరైన అనిల్ సుంకర తెలియజేయడం జరిగింది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా బడ్జెట్ రూ.9.5 కోట్ల రూపాయల అట.


అయితే ఇదంతా పబ్లిసిటీ ప్రమోషన్స్ ఇలా అంతటితో కలుపుకొని ఇంత బడ్జెట్ అయినట్లు సమాచారం. అయితే ముందుగానే నిర్మాతలు సేఫ్ సైడ్ అయిపోయినట్టుగా సమాచారం టేబుల్ ప్రాపర్టీ లో ఈ సినిమా ఉందని తెలియజేశారు పెద్దగా మార్కెట్ లేని హీరోపై ఇంత బడ్జెట్ పెట్టడం రిస్క్ అయినప్పటికీ కమిట్మెంట్ను నమ్మి నిర్మాతలు అశ్విన్ ను ఇంత బడ్జెట్ పెట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలోని స్టోరీ సెకండ్ ఆఫ్ ట్విట్ పలు యాక్షన్స్ సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా ఉండబోతున్నాయి.. ఇందులో మైనస్ కేవలం స్లోగా సాగే స్క్రీన్ ప్లే తప్ప మరేవి కూడా ఈ సినిమాకి మైనస్ గా అనిపించలేదట. ఇక ఇందులో నటీనటుల యాక్టింగ్ విషయానికి వస్తే అశ్విన్ బాబు మరొకసారి తన నటనతో ఇరగదీసేసారట. ఐపీఎస్ క్యారెక్టర్ లలో హీరోయిన్ నందిత శ్వేత యాక్టింగ్ తో పాటు డ్రెస్సింగ్ స్టిల్స్ కూడా అందర్నీ ఆకట్టుకునే విధంగా ఉన్నాయట.. ఓవరాల్గా ఈ సినిమా యాక్షన్ త్రిల్లర్ ప్రియులకు మంచి విందని తెలియజేస్తున్నారు ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: