అఖిల్ కు తోడైన జాహ్నవి !

Seetha Sailaja
అఖిల్ లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’ ఊహించని ఫెయిల్యూర్ ను అందుకోవడంతో అక్కినేని అభిమానులు మాత్రమే కాకుండా అక్కినేని కాంపౌండ్ కూడ షాక్ అయింది. దీనితో ఇప్పట్లో అఖిల్ నుండి మరో మూవీ ప్రాజెక్ట్ రావడం కష్టమే అంటూ చాలా మంది అభిప్రాయ పడ్డారు. అయితే అఖిల్ కెరియర్ ఎవరు ఊహించని టర్న్ తీసుకోబోతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.


ప్రముఖ నిర్మాణ యువీ క్రియేషన్స్ అఖిల్ తో ఒక భారీ బడ్జెట్ తో ఒక ఫ్యాంటసీ సినిమాను తీయడానికి రంగం సిద్ధం చేసినట్లు లీకులు వస్తున్నాయి. గతంలో యువి క్రియేషన్స్ ‘సాహో’ తీసినప్పుడు ఆమూవీ దర్శకుడు సుజిత్ దగ్గర సహాయకుడుగా పనిచేసిన అనీల్ కుమార్ అనే యంగ్ డైరెక్టర్ చెప్పిన కథ యువీ క్రియేషన్స్ కు బాగా నచ్చడంతో ఇప్పుడు ఆ కథతో ఒక భారీ ఫ్యాంటసీ మూవీని తీయడానికి రంగం సిద్ధం అవుతున్నట్లు టాక్.


ఈమూవీకి ‘ధీర’ అన్న టైటిల్ ఇప్పటికే ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈమూవీలో అఖిల్ పక్కన హీరోయిన్ గా జాహ్నవీ కపూర్ నాటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జూనియర్ తో కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ మూవీలో నటిస్తున్న ఈమెకు ఆమూవీ విడుదల కాకుండానే ఇప్పుడు అఖిల్ పక్కన మరొక ఛాన్స్ కొట్టింది అనుకోవాలి.


ఈమూవీని పాన్ ఇండియా మూవీగా విడుదల చేసే ఉద్దేశ్యం ఉండటంతో జాహ్నవి ఈమూవీ ప్రాజెక్ట్ లో ఎంటర్ అయితే ఈమూవీ మార్కెట్ కు సమస్య ఉండదు అన్న ఉద్దేశ్యంతో ఈమూవీ నిర్మాతలు జాహ్నవీ ని ఎంపిక చేసి ఉంటారు అని అంటున్నారు. శ్రీదేవి తో నాగార్జున అనేక సూపర్ హిట్ సినిమాలలో నటిస్తే ఇప్పుడు ఆ సెంటిమెంట్ ను రిపీడ్ చేయడానికి అఖిల్ జాహ్నవి తో నటిస్తున్నాడు అనుకోవాలి. ఇప్పటికే వరస ఫ్లాప్ లతో సత్యమతమైతున్న అఖిల్ ఇమేజ్ ని పట్టించు కోకుండా మూవీ క్రియేషన్స్ ఇలాంటి భారీ సినిమాను ఈ అక్కినేని యంగ్ హీరోతో సినిమాను తీయడం సాహసం అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: