రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఆది పురుష్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. కృతి సనన్ ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా నటించింది. ఈ మూవీ జూన్ 16 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 4 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.
ఈ మూవీ నాలుగు రోజుల్లో నైజాం ఏరియాలో 32 కోట్ల కలక్షన్ లను వసూలు చేయగా , సీడెడ్ ఏరియాలో 8.14 కోట్లు , యు ఏ లో 8.90 కోట్లు , ఈస్ట్ లో 5.16 కోట్లు , వేస్ట్ లో 3.66 కోట్లు , గుంటూరు లో 6.11 కోట్లు , కృష్ణ లో 3.88 కోట్లు , నెల్లూరు లో 1.91 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల్లో 69.76 కోట్ల షేర్ ... 110.40 కోట్ల గ్రాస్ కలక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ నాలుగు రోజుల్లో కర్ణాటక ఏరియాలో 10.81 కోట్ల కలెక్షన్ లను వసూలు చేయగా , తమిళ నాడు ఏరియాలో 2.06 కోట్ల కలక్షన్ లను , కేరళ లో 72 లక్షల కలక్షన్ లను , హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 59.20 కోట్ల కలెక్షన్ లను , ఓవర్ సీస్ లో 20.90 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.
మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 163.45 కోట్ల షేర్ ... 326.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇలా ఈ మూవీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ సూపర్ సాలిడ్ కలక్షన్ లను వసూలు చేస్తుంది.