నా మాటలను వారు తప్పుగా అర్ధం చేసుకున్నారు : చిరంజీవి

murali krishna
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఓ ప్రైవేట్ క్యాన్సర్ సెంటర్ ప్రారంభించడం అయితే జరిగింది. ఈ క్రమంలో చిరంజీవి సంచలన వ్యాఖ్యల ను చేసారు.
క్యాన్సర్ పై అవగాహన ఉండాలని.. కూడా వ్యాఖ్యానించారు. తాను ఆ రీతిగా అవగాహన ఉండటం వల్ల ఒకానొక దశలో క్యాన్సర్ బారిన పడకుండా కొన్ని పరీక్షల వల్ల తప్పించుకోగలిగినట్లు కూడా తెలియజేయడం జరిగింది. దీంతో చిరంజీవి క్యాన్సర్ బారిన పడినట్లు ఎలక్ట్రానిక్ మరియు వెబ్ మీడియాలో వార్తలు రావడంతో చిరంజీవి వెంటనే సోషల్ మీడియా  ద్వారా క్లారిటీ ఇచ్చారు. "కొద్ది సేపటి క్రితం నేనొక క్యాన్సర్ సెంటర్ ని ప్రారంభించిన సందర్భంగా క్యాన్సర్ పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం గురించి నేను మాట్లాడాను. రెగ్యులర్ గా మెడికల్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా అయితే నివారించవచ్చు అని చెప్పాను. నేను అలర్ట్ గా వుండి కొలోన్ స్కోప్ టెస్ట్ చేయించుకున్నాను.
'అలా ముందుగా టెస్ట్ చేయించుకోకపోయివుంటే అది క్యాన్సర్ కింద మారేదేమో' అని మాత్రమే నేను అన్నాను. అందుకే అందరూ ముందు జాగ్రత్తలు తీసుకుని మెడికల్ టెస్టులు / స్క్రీనింగ్ చేయించుకోవాలి' అని మాత్రమే నేను అన్నాను. అయితే కొన్ని మీడియా సంస్థలు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా 'నేను క్యాన్సర్ బారిన పడ్డాను' అని 'చికిత్స వల్ల బతికాను' అని స్క్రోలింగ్ లు, వెబ్ ఆర్టికల్స్ కూడా మొదలు పెట్టాయి. దీని వల్ల అనవసరమైన కన్ఫ్యూషన్ అయితే ఏర్పడింది. అనేకమంది వెల్ విషర్స్ నా ఆరోగ్యం గురించి మెసేజ్ లు కూడా పంపిస్తున్నారు. వారందరి కోసం ఈ క్లారిఫికేషన్. అలాగే అలాంటి జర్నలిస్టులకి కూడా ఓ విజ్ఞప్తి. విషయాన్ని అర్థం చేసుకోకుండా అవాకులు చవాకులు అయితే రాయకండి. దీనివల్ల అనేక మందిని భయభ్రాంతుల్ని చేసి బాధ పెట్టిన వారవుతారు" అని క్లారిటీ ఇవ్వటం అయితే జరిగింది. దీంతో చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: