మిగతా హీరోలతో పోలిస్తే రేసులో చాలా వెనకబడిపోయారు అక్కినేని స్టార్ హీరోలు. నాగార్జున, నాగచైతన్య, అఖిల్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్తో చాలా తీవ్రంగా సతమతమవుతున్నారు.ముఖ్యంగా నాగ చైతన్య, అఖిల్ అయితే రీసెంట్ గా ఘోరమైన డిజాస్టర్స్ అందుకున్నారు. ఇటీవల వచ్చిన ఏజెంట్, కస్టడీ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర 50 కోట్ల దాకా నష్టాన్ని మిగిల్చారు అక్కినేని సోదరులు. ముఖ్యంగా మంచి హిట్లతో ఊపుమీదున్న నాగ చైతన్య ఆ తరువాత వరుస ఫ్లాపులు ఫేజ్ చేశాడు. బాలీవుడ్లో అమీర్ ఖాన్తో చేసిన లాల్ సింగ్ చడ్డా ఇంకా దిల్ రాజు బ్యానర్లో వచ్చిన థాంక్యూ.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో చేసి కస్టడీ సినిమాలు.. చైకి ఏమాత్రం హిట్ ఇవ్వలేకపోయాయి. దాంతో తమ హీరోకి అర్జెంట్గా ఓ హిట్ పడితే బాగుంటుదని భావిస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్. ఈ క్రమంలో నాగ చైతన్యకు ఓ సాలిడ్ ప్రాజెక్ట్ సెట్ అయిపోయింది.అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ లాంటి స్టార్ బ్యానర్లో చైతన్య ఓ సినిమా చేయబోతున్నాడు.
కార్తికేయ2 సినిమాతో మంచి పాన్ ఇండియా హిట్ అందుకున్న డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్పైకి వెళ్లనుంది. తాజాగా ఈ సినిమా గురించి నిర్మాత బన్నీ వాసు అదిరిపోయే అప్డేట్ కూడా ఇచ్చాడు. సముద్రం బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా రాబోతుందని ఆయన చెప్పుకొచ్చాడు. ఇందులో చైతన్య బోట్మ్యాన్గా, జాలరీగా కనిపిస్తాడని అన్నారు. గుజరాత్లో జరిగిన కొన్ని నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా ఉంటుందని ఆయన అన్నారు. దాంతో ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ ఖర్చు చేయబోతున్నట్టు సమాచారం తెలుస్తోంది. ఏకంగా యాభై కోట్లకు పైగానే పెట్టబోతున్నట్టు ఇండస్ట్రీ టాక్. ఈ లెక్కన చైతు కెరీర్లో హయ్యెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ ఇదేనని ఈజీగా చెప్పొచ్చు. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ రేంజ్లో ఖర్చు చేస్తుందంటే.. ఖచ్చితంగా నాగ చైతన్య కెరీర్లో ఈ సినిమా ఓ పెద్ద హిట్ గా నిలిచిపోతుందనే నమ్మకంతో ఉన్నారు అక్కినేని ఫ్యాన్స్.