తాతకు నివాళులు అర్పించిన ఎన్టీఆర్..!!

Divya
తెలుగు భాషకు తెలుగు వారికి ఒక గుర్తింపు తెచ్చి పెట్టిన మహా నాయకుడుగా పేరుపొందారు సీనియర్ ఎన్టీఆర్. నటుడుగా తన ప్రస్థానం మొదలుపెట్టి టాప్ హీరోగా తెలుగు సినీ పరిశ్రమను కూడా ఏలడం జరిగింది. ఆ తర్వాత ప్రజల బాగు కోసం రాజకీయాలలోకి వచ్చి వారి సమస్యలను తెలుసుకొని ఆంధ్రప్రదేశ్ సీఎం గా పరిపాలించారు. ఎంతోమంది అభిమానులను సంపాదించారు ఎన్టీఆర్.అయితే ఆయన మరణించిన కొన్ని సంవత్సరాల అవుతున్న ఇప్పటికీ ఆయన్ని తలుచుకుంటూ ఆయన సాధించిన విజయాలను మంచి పనులను సహిత తెలియజేస్తూ ఉన్నారు అభిమానులు.

ఈ రోజున నందమూరి తారక రామారావు గారి వందోవ పుట్టినరోజు.. వీటిని తెలుగు వారంతా ఎన్టీఆర్ శతజయంతిగా చాలా ఘనంగా జరుపుతూ ఉన్నారు. ఇక ఎన్టీఆర్ కుటుంబం తెలుగుదేశం నాయకులు ఎన్టీఆర్ అభిమానులు హైదరాబాదులో ఉన్న ఎన్టీఆర్ ఘాట్ వద్ద  నివాళులు అర్పిస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ పలువురు తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఎన్టీఆర్కు నివాళులు అర్పించి మీడియాతో మాట్లాడడం జరిగింది. బాలయ్య వెళ్లిపోయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అక్కడికి వచ్చి తన తాతకు పూలు సమర్పించి నివాళులు అర్పించారు.

జూనియర్ ఎన్టీఆర్ నివాళులు అర్పించిన తరువాత అక్కడ నుంచి వెళ్లిపోయారు ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తో సెల్ఫీలు తీసుకోవడానికి అక్కడికి వచ్చిన అభిమానులు సైతం ఎగబడ్డారు కానీ ఎన్టీఆర్ మాత్రం మీడియాతో మాట్లాడకుండానే వెళ్ళిపోయారు. ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కలిసి నివాళులు అర్పించడానికి వస్తూ ఉండేవారు అయితే ఈసారి మాత్రం కళ్యాణ్ రామ్ ఇంకా రాలేదు.. జూనియర్ ఎన్టీఆర్ నివాళులు అర్పించడానికి వచ్చినవేల ఎన్టీఆర్ షూట్ వద్ద అభిమానులు కూడా భారీగానే తరలిరావడం జరిగింది. ఎన్టీఆర్ బౌన్సర్లు ఉన్నప్పటికీ కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది ఈ సమయంలో ఒక ఎన్టీఆర్ అభిమాని గుండెపోటుకు గురయ్యారు. వెంటనే హుటావిటిక అతనిని హాస్పిటల్ కి సైతం తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: