ట్రైలర్: హిడింబ ట్రైలర్ తో అదరగొడుతున్న ఓంకార్ తమ్ముడు అశ్విన్..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో జతకలిసే, రాజు గారి గది వంటి సిరీస్లలో నటించి మంచి పాపులారిటీ సంపాదించారు ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు.. హీరోగా ప్రస్తుతం హిడింబ అనే సినిమాలో నటిస్తున్నారు.. ఈ చిత్రం అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో తెరకెక్కిస్తూ ఉన్నారు.. ఈ సినిమా ట్రైలర్ను తాజాగా నటుడు సాయిధరమ్ తేజ్ విడుదల చేయడం జరిగింది.ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచే ఈ సినిమా యాక్షన్ బ్యాక్ కథ అన్నట్లుగా వార్తలు వినిపించాయి. అలాగే హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఈ టీజర్లో చూపించారు.

ఇక ట్రైలర్ చూసి ప్రేక్షకులు సైతం ఈ సినిమా అంచనాలను పెంచేస్తూ ఉన్నారు..1908 లో బ్రిటిష్ కాలంలో నరమాంసభక్షకులు ఉండే ఒక దీపానికి ఖైదీలను తీసుకొని వెళ్లి వదిలేసిన వాళ్లతో ఈ సినిమా ట్రైలర్ ని ఓపెన్ చేయడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్రంలో ప్రతిరోజు కూడా అమ్మాయిల మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయని విషయాన్ని ఛానల్ వాయిస్ తో ఎలివేట్ చేయడం జరిగింది ఈ కేస్ ఇన్వెస్ట్ ఆఫీసర్గా అశ్విన్ బాబు, నందిత శ్వేతా ని రివ్యూ చేశారు.

రెడ్ కలర్ దుస్తులు వేసుకున్న వారందరిని కిడ్నాప్ చేస్తున్నారని ఒక ఐడెంటిటీ గుర్తిస్తారు.. ఆ తర్వాత కిడ్నాప్లను మాత్రం ఆపలేక పోతారు.. దీంతో వారి మిషన్ ఫీల్ అవుతుంది ఇన్వెస్టిగేషన్ ని మరొక యాంగిల్ లో మొదలు పెడతారు. ముఖ్యంగా నాలుగు కొమ్ముల మాస్కుని ఐడెంటిఫై చేయడం తర్వాత ఆ మాస్కు వేసుకొని కిడ్నాప్లు చేస్తోంది ఎవరు వారి వెనుక ఉన్న కథ ఏంటి అనే విషయం పైన ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోని డైలాగులు కూడా బాగానే ఆసక్తి కలిగించే కనిపిస్తున్నాయి. ఈ సినిమా ట్రైలర్ పూర్తిగా కంప్లీట్ యాక్షన్ సినిమాగా ఉన్నట్లు ఈ ట్రైలర్ చూస్తే కనిపిస్తోంది. ఓవరాల్ గా సైకోథ్రిల్లర్ కోణంలో ఈ సినిమా ఉండబోతున్నట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: