లైంగిక వేధింపులకి గురైన సీనియర్ నటి కుమార్తె.....!!
అంతటి నేపథ్యం ఉన్న ఆమె ప్రస్తుతం స్టార్ స్టేటస్ అనుభవించే పరిస్దితిల లేదు. ఆమె కనీసం మూడు పూటలా సరిగా తినలేని స్థితిలో ఉంది. పూట గడవడం కోసం ఈ స్టార్ నటి ఇంటింటికి తిరిగి సబ్బులు అమ్ముకుంటూ సేల్స్గర్ల్గా మరింది. ఈ విషయాన్ని తానే స్వయంగా చెప్పింది. ఆమే ఐశ్వర్య భాస్కరన్. అయితే ఇలా కూడా తనను బ్రతకనివ్వటం లేదంటోంది.
తాజాగా ఆమె లైంగిక వేధింపులకు గురైనట్లుగా ఒక యూట్యూబ్ ఛానల్ లో వెల్లడించారు. ఆన్ లైన్ లో తాను ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల గురించి ఐశ్వర్య మాట్లాడుతూ యూట్యూబ్ ఛానల్ మల్టీ మమ్మీలో ఆమె స్పందించారు. చాలామంది నెటిజన్లు ఆన్లైన్లో తనకు అసహ్యకరమైన మెసేజ్ లు పంపారని అది తనని ఎంతగానో బాధకు గురి చేసిందని చెప్పుకొచ్చారు. ఫోటోలు, మెసేజ్ లు తనకు మానసిక వేదనకు గురిచేశాయని ఐశ్వర్య ఈ సందర్భంగా వెల్లడించారు. మళ్లీ ఇదే కనుక రిపీట్ అయితే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.
''నేను మొదలు పెట్టిన సబ్బుల వ్యాపారం వృద్ధి చెందాలనే ఉద్దేశం కొంతకాలం క్రితం ఓ నిర్ణయం తీసుకున్నాను. సబ్బులు కావాల్సిన వాళ్లు ఆర్డర్ చేసుకోవడానికి వీలుగా నా ఫోన్ నంబర్ను అందరితో పంచుకున్నాను. కొంతమంది దాన్ని అదునుగా తీసుకుని నాకు అసభ్యకర సందేశాలు పంపిస్తున్నారు. అశ్లీల ఫొటోలు కూడా షేర్ చేస్తున్నారు. ఇదే కనుక మళ్లీ కొనసాగితే ఆ వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాను'' అని ఇటీవల తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఐశ్వర్య వెల్లడించారు. అర్థరాత్రి సమయంలో మెసేజ్ పంపి ఇప్పుడు వచ్చి మీ సబ్బులు చూడవచ్చా అని కోరాడని ఆమె కామెంట్ చేసింది.
ప్రముఖ నటి లక్ష్మి కూతురుగా సినీరంగ ప్రవేశం చేసింది ఐశ్వర్య భాస్కరన్. ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంటూ మంచి నటిగా ప్రత్యేక గుర్తింపు పొందింది. 1989లో వచ్చిన అడవిలో అభిమన్యుడు సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ పరిచయమైంది. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వరుస పెట్టి సినిమా ఆఫర్లు అందుకుంది. మోహన్లాల్తో హిట్ సినిమాలైన బటర్ఫ్లైస్, నరసింహమ్, ప్రజా వంటి వాటిలో నటించింది.
ఆ తర్వాత హీరోయిన్గా అవకాశాలు కరువైన నాని వంటి చిత్రాల్లో చిన్నచిన్న పాత్రలు చేసి మెప్పించింది. అంతేకాదు పలు టీవీ సీరియల్స్లో కూడా ఆమె నటించింది. ప్రస్తుతం ఆఫర్లు లేకపోవడంతో ఆమె సబ్బులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నట్టు స్యయంగా ఆమె చెప్పుకొచ్చింది.