ఇలాంటి ఫేక్ ప్రచారం సమంతకు అవసరం లేదు..!!

Divya
సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమా ప్రమోషన్స్లో చాలా బిజీగా ఉంటోంది. అందులో భాగంగా ఇమే హైదరాబాద్ తో పాటు ఇతర దేశాలలో కూడా ముఖ్య పట్టణాలలో మీడియాతో సమావేశమై అభిమానులతో ముచ్చటిస్తున్నట్లుగా తెలుస్తోంది. హీరోయిన్గా సమంత కు ఈ చిత్రం చాలా స్పెషల్ అన్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గుణశేఖర్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.ఈ సినిమాని త్రీడీలో కూడా చూడవచ్చు అన్నట్లుగా తెలుస్తోంది.ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ కోసం చిత్ర బృందం ఫుల్ బిజీగా ఉన్నారు.
తాజాగా ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఆర్మన్ మాలిక్ సంగీత కార్యక్రమానికి సమంతా హాజరు అవ్వడం జరిగింది. ఇందులో కూడా శాకుంతలం సినిమాను ప్రమోట్ చేయడానికి అన్నట్టుగా తెలుస్తోంది. అయితే సమంత అభిమానులు కొందరు శాకుంతలం పిఆర్ టీమ్ సోషల్ మీడియాలో చాలా హడావిడిగా చేస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో శాకుంతలం సినిమా యొక్క ఈవెంట్ జరిగింది. భారీ ఎత్తున జనాలు వచ్చినట్లుగా ప్రచారం చేయడం జరుగుతోంది. సమంత ఈ కార్యక్రమానికి హాజరు అయిన కూడా ఆస్థాయి ఏంటి అంతకుమించి జనాలు హాజరవుతారు ఆమె స్టామినా తక్కువేమీ కాదు అంటూ ఆమె క్రేజ్ కు ఉన్న పీఆర్ టీమ్ ఇలా వేరు వేరు కార్యక్రమాలకు సంబంధించి ఫోటోలను షేర్ చేసీ సమంత కోసం వచ్చిన ఫ్యాన్స్ అంటూ కలరింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
అయితే సమంతకు ఇలాంటి ఫేక్ ప్రచారం అక్కర్లేదు అంటూ టీం ఇలా ఎందుకు చేస్తున్నారు అంటూ కొంతమంది అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో సమంత ఎల్బీ స్టేడియంలో సందడి చేసినటువంటి కొన్ని ఫోటోలు సైతం వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలను సమంత వెనుక పెద్ద ఎత్తున జనాలు ఉన్నట్లుగా కనిపిస్తోంది ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నట్లు తెలుస్తోంది ఈ ఫోటోలు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: