జబర్దస్త్ రీ ఎంట్రీ పై.. నాగబాబు ఏమన్నారో తెలుసా?

praveen
మెగా బ్రదర్ నాగబాబు గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగబాబు ఇక ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. అయితే హీరో గా  రాణించాలి అని అనుకున్నప్పటికీ ఎందుకో అన్న చిరంజీవిలాగ మాత్రం నాగబాబు క్లిక్ అవ్వలేకపోయారు. ఇక ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే పరిమితం అయ్యారు అని చెప్పాలి. అంతేకాదు అంజనా ప్రొడక్షన్స్ అనే ఒక నిర్మాణ సంస్థను స్థాపించి ఇక ఎన్నో సినిమాలను కూడా నిర్మించారు.

 నిర్మాణరంగంలో కూడా ఆయనకు కలిసి రాకపోవడంతో భారీగానే నష్టాలను చవిచూసారు. అయితే ఈటీవీలో సాదాసీదా కామెడీ షో గా ప్రారంభమైన జబర్దస్త్ లో జడ్జిగా అవతారం ఎత్తారు మెగా బ్రదర్ నాగబాబు. నటుడిగాకంటే జబర్దస్త్ జడ్జ్ గానే ఆయన ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక జబర్దస్త్ షో బాగా పాపులారిటీ సంపాదించింది అంటే అది కేవలం నాగబాబు నవ్వుల కారణంగానే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలాంటి నాగబాబు ఇక జబర్దస్త్ నుంచి జడ్జిగా ఒక్కసారిగా తప్పుకున్నారు. మిగతా చానల్లలో పలు షోలలో జడ్జిగా అవతారమెత్తినప్పటికీ ఆ షోలు మాత్రం పెద్దగా క్లిక్ ఇవ్వలేదు.

 అయితే నాగబాబు మళ్ళీ జబర్దస్త్ జడ్జిగా రాబోతున్నారంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. దీంతో అభిమానులు కూడా ఇది నిజమైతే బాగుండు అని కోరుకుంటున్నారు. ఇకపోతే ఇటీవల జబర్దస్త్ లోకి రి ఎంట్రీ ఇస్తారా అంటూ నాగబాబుని ప్రశ్నించగా.. ఆయన ఆసక్తికర సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. జబర్దస్త్ తో తనకు ఎలాంటి గొడవ లేదని..  మల్లెమాల వాళ్లతో కొంతమంది కమెడియన్స్ కి ఇబ్బందులు వచ్చినప్పుడు మాత్రమే వారి కోసం నేను బయటకి వచ్చేసాను అంటూ క్లారిటీ ఇచ్చారట నాగబాబు. దీన్ని బట్టి మల్లెమాల వాళ్ళ దగ్గర నుంచి మళ్లీ పిలుపు వస్తే జబర్దస్త్ జడ్జిగా చేస్తాను అంటూ ఇన్ డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: