నటుడిగా కెరియర్ ను మొదలు పెట్టి , ఆ తర్వాత
నిర్మాత గా తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును తెచ్చుకున్న
బండ్ల గణేష్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరియర్ ప్రారంభంలో అనేక సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించి నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో ఏర్పరచుకున్న
బండ్ల గణేష్ ఆ తర్వాత
రవితేజ హీరోగా తెరకెక్కిన ఆంజనేయులు
మూవీ తో నిర్మాతగా మారాడు.
తాజాగా
బండ్ల గణేష్ తన సోషల్
మీడియా వేదికగా రాజకీయాలకు దూరంగా ఉండే విషయం గురించి స్పందిస్తూ ... నమస్కారం నా కుటుంబ బాధ్యతలు వల్ల ... నా ఉమ్మడి కుటుంబ సభ్యుల నేపథ్యంలో ... వారి కోరికపై ... మా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ... నాకున్న పనుల వల్ల ... వ్యాపారాల వల్ల ... నేను రాజకీయాలకు దూరంగా ఉండాలి అని నిర్ణయించుకున్నాను. నాకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం గానీ ... మిత్రుత్వం గాని లేదు. అందరూ నాకు ఆత్మీయలే ... అందరూ నాకు సమానులే ... ఇంతకు ముందు నా వల్ల ఎవరైనా ప్రత్యక్షంగా గాని ... పరోక్షంగా గాని ... బాధపడి ఉంటే నన్ను పెద్ద మనసుతో క్షమిస్తారని ఆశిస్తూ మీ
బండ్ల గణేష్ అని సోషల్
మీడియా వేదికగా
బండ్ల గణేష్ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.