సమంతకు "చై" తో విడిపోయేటప్పటికీ ఆ వ్యాధి ఉందా ?

VAMSI
" data-original-embed="" >

సినీ నటుల జీవితాలు తెరమీదనే బాగుంటాయి, తెరవెనుక ఎవరు ఎన్ని కష్టాలు బాధలు అనుభవిస్తున్నారు అన్నది తెలియదు. సందర్భాన్ని బట్టి కొన్ని కొన్ని వెలుగులోకి వస్తుంటాయి. గత సంవత్సరం ముందు మనకు ఎంతో ఇష్టమైన నటీనటుల జంట చై మరియు సమంత లు వివాహబంధానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం తెలిసిన చై మరియు సమంత అభిమానులు , ఫ్రెండ్స్ , బంధువులు మరియు కుటుంబ సభ్యులు చాలా బాధపడ్డారు. ఎంతో చూడముచ్చటగా ఉన్న ఈ అందాల జంట అప్పుడే అకారణంగా విడిపోయిందా అంటూ కొందరు ఏమో సమంత ది తప్పు అన్నారు, మరికొందరు ఏమో చై మరియు వారి కుటుంబానిదే తప్పు అన్నారు .
కానీ ఎక్కువ మంది మాత్రం సమంత కావాలనే కాపురాన్ని పాడు చేసుకుందని సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోశారు. మొత్తానికి సమంత విడిపోయాక కెరీర్ పై దృష్టి పెట్టి వివిధ భాషల్లో వరుస సినిమాలు చేసుకుంటూ పోతోంది. అదే విధంగా నాగ చైతన్య సైతం సినిమాలపై పూర్తిగా తన దృష్టిని కేంద్రీకరించాడు.  అయితే తాజాగా స్వయంగా సమంత తెలిపిన సమాచారం మేరకు తాను మయోసైటిస్ అనే భయంకరమైన వ్యాధితో బాధపడుతోంది తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ విషయం తెలియగానే మొదట అందరూ సీరియస్ గా తీసుకోలేదు. సమంత హాస్పిటల్ లో ఉన్న ఫోటోను చూడగానే అది నిజమని నిర్దారణకు వచ్చారు.
ఈ వ్యాధి ఏమైనా దెబ్బలు మరియు ఇన్ఫెక్షన్ లు సోకినప్పుడు కండరాలు వాపు వస్తాయట.. దీనినే మయోసిటిస్ అని పిలుస్తారట. అయితే ఇది కొన్ని సార్లు ప్రాణం మీదకు కూడా వస్తుందని ట్రీట్ మెంట్ చేస్తున్న డాక్టరు తెలిపారు. అయితే సమంతకు చై తో బంధం విడిపోయే ముందు ఈ వ్యాధి ఉందా లేదా అని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. అందుకే ఈమె చై గురించి అలోచించి విడాకులు తీసుకుందా అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: