తమిళ దర్శకుడు మణిరత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. రెండు పార్టులుగా తెరకెక్కింది. ఇక తొలి పార్ట్ సెప్టెంబర్ 30న విడుదలై చాలా విజయవంతంగా నడుస్తోంది.ఎన్నో భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా తమిళ ప్రేక్షకులు ఈ సినిమాని ఎంతగానో ఆదరిస్తున్నారు. ఇక చాలా రోజుల తర్వాత మణిరత్నం ఈ సినిమాతో ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ అందించారు. తమిళ రచయిత కల్కి రాసిన నవల ఆధారంగా, చోళుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ ముందు వసూళ్ల సునామి సృష్టిస్తోంది.మరీ ముఖ్యంగా తమిళనాడులో ఈ సినిమాకు విపరీత క్రేజ్ లభిస్తోంది. ఒక్క తమిళనాడులోనే ఏకంగా రూ. 100 కోట్ల షేర్ క్లబ్లో చేరడానికి సిద్ధమైందీ చిత్రం. ఇక మిగతా భాషల్లోనూ ఈ సినిమాకు చెప్పుకోదగ్గ కలెక్షన్స్ వస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ ఏకంగా రూ. 147 కోట్ల గ్రాస్ను క్రాస్ చేయడం విశేషం. ఇదిలా ఉంటే ఈ కి ప్రపంచ వ్యాప్తంగా రూ.130 కోట్ల ప్రిరిలీజ్ బిజినెస్ జరిగింది.తమిళ్తో పాటు ఓవర్సీస్లో కూడా కు మంచి టాక్ రావడంతో బ్రేక్ ఈవెన్ చాలా సులభంగా సాధిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రంలో అదే స్థాయిలో నటీనటులు ఉన్నారు. చియాన్ విక్రమ్, 'జయం' రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్యా లక్ష్మి, ప్రకాష్రాజ్, శరత్కుమార్, విక్రమ్ ప్రభు, శోభిత ధూళిపాళ, కీలక పాత్రల్లో నటించారు.ఇక వసూళ్ల సునామీ సృష్టిస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి పాత రికార్డులు బద్ధలు కొడుతుందని ఈ మూవీ మేకర్స్ భావిస్తున్నారు. మరి చూడాలి ఈ మూవీ ఇంకెన్ని రికార్డులు బద్ధలు కొడుతుందో.