నిఖిల్ దెబ్బకు నితిన్ కి గట్టి షాక్?

Purushottham Vinay
నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే గత రెండు మూడు సినిమాలు ఈమధ్య నితిన్ ను నిరాశ పరిచాయి. అందుకే ఈసారి మంచి మాస్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఇక తాజాగా ఈయన నటించిన మాచర్ల నియోజక వర్గం సినిమా రిలీజ్ అయ్యింది. డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగష్టు 12 వ తేదీన రిలీజ్ అయ్యింది.ఇక ఈ సినిమాలో సముద్రఖని విలన్ పాత్రలో నటించగా.. కృతి శెట్టి, క్యాథరిన్ త్రేస్సా హీరోయిన్ లుగా నటించారు.. ఇంకా అలాగే తెలుగమ్మాయి అంజలి ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించింది.. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్ సంగీతం అందించిన ఈ సినిమాను శ్రేష్ఠ మూవీస్ వారు నిర్మించారు.నితిన్ కెరీర్ కు ఈ సినిమా చాలా కీలకంగా మారింది. ఈ సినిమా ఎన్నో మంచి అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. మరి అలాంటి సినిమా రిలీజ్ అయ్యి ఎంత కలెక్ట్ చేస్తుందా అని అంతా కూడా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సినిమా రివ్యూల పరంగా నెగిటివ్ టాక్ రావడంతో ప్లాప్ అని దెబ్బకి తేలిపోయింది.


కానీ ఈ సినిమాలో అంజలి చిందేసిన రారా రెడ్డి సాంగ్ అయితే కొద్దిగా ఓపెనింగ్స్ బాగా రాబట్టడంలో సహాయం చేసింది.ఈ సినిమా మొత్తంగా చుస్తే ఫస్ట్ డే మొత్తం 4.96 కోట్లు రూపాయల షేర్ రాబట్టింది. అయితే ఈ సినిమా రెండవ రోజు కలెక్షన్స్ మీద కార్తికేయ 2 సినిమా అయితే బాగా దెబ్బేసింది. ఈ సినిమా ఆగష్టు 13 వ తేదీన రిలీజ్ అయ్యింది. ఇక ఈ సినిమా కారణంగా మాచర్ల రెండవ రోజు కేవలం 1.62 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది.రెండు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కూడా మొత్తం 6.69 కోట్లు మాత్రమే రాబట్టింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 22 కోట్లు రాబట్టాలి. మరి ఈ పరిస్థితి చూస్తుంటే నితిన్ ఇంకా అంత రాబడతాడు అని అనిపించడం లేదు.. కానీ వీకెండ్ తో పాటు ఆగష్టు 15 వ తేదీ కూడా సెలవు కావడంతో కొద్దిగా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది.. ఇక మరి ఈ రెండు రోజుల్లో నితిన్ మాచర్ల పుంజుకుంటుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: