యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియాలోనే పెద్ద పాన్ ఇండియా స్టార్ గా పేరు సంపాదించుకున్నాడు.బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ ఫేమ్ దక్కించుకున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు వరుసగా పెద్ద పెద్ద పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెట్టాడు. ఆ సినిమాల్లో ఒకటైన ఆది పురుష్పై అభిమానుల్లో అయితే ఎన్నో రకాల భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక ఈ హైబడ్జెట్ మూవీని రామాయణం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ రూపొందిస్తున్నాడు. ఈ పౌరాణిక సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా అలరించనున్నాడు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా… ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ మూవీ 2023 జనవరి 12 వ తేదీ న థియేటర్లలో రిలీజ్ కానుంది.అయితే తాజాగా ఆది పురుష్ మూవీ నుంచి మరో ఆసక్తికరమైన అప్డేట్ అనేది వచ్చింది.
డైరెక్టర్ ఓం రౌత్ ఆది పురుష్ మూవీని త్రీడీ వెర్షన్ ఇంకా అలాగే ఐమాక్స్ ఫార్మాట్లో థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించాడు. ఆదిపురుష్ సినిమాని థియేటర్లలో చూసే వారికి సాధ్యమైనంత ఉత్తమమైన అనుభూతిని కూడా అందించడానికి ఓం రౌత్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ మేరకు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లాస్ ఏంజెల్స్లో పూర్తి చేస్తున్నట్లు ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపాడు. ఇంకా అలానే ప్రేక్షకుల ముందుకు తన మూవీని తీసుకొచ్చేందుకు తాను ఎంతగానో వెయిట్ చేస్తున్నట్లు కూడా తెలిపాడు. ఈ సందర్భంగా ఐమ్యాక్స్ కెమెరాతో దిగిన ఒక ఫొటోను కూడా ప్రభాస్ షేర్ చేశాడు.ఇక ఇది నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.తరువాత సినిమాలతో కూడా ప్రభాస్ పెద్ద పాన్ ఇండియా హిట్లు అందుకోవడం ఖాయమని ఫ్యాన్స్ భావుస్తున్నారు.