24 గంటల్లో అత్యధిక వ్యూస్ ని సాధించిన 5 టాలీవుడ్ మూవీస్ లిరికల్ సాంగ్ లు ఇవే..!

Pulgam Srinivas
ప్రస్తుతం సినిమా ప్రమోషన్ లలో భాగంగా ఒక్కో సాంగ్ ని మూవీ మేకర్స్ విడుదల చేస్తూ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా స్టార్ హీరోలు నటించిన సినిమాల్లోని సాంగ్ లకీ , స్టార్ దర్శకులు దర్శకత్వం వహించిన మూవీ లోని సాంగ్ లకు అలాగే ఫుల్ క్రేజ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లు సంగీతం అందించిన సినిమా సాంగ్స్ పై మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండటం ద్వారా ఆ సినిమాలోని పాటలకు విడుదలయిన అతి తక్కువ సమయంలోనే అదిరిపోయే  రేంజ్ లో వ్యూస్ లభిస్తూ ఉంటాయి. అందులో భాగంగా టాలీవుడ్ సినిమాల నుండి విడుదల అయిన పాటలలో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన 5 పాటల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట మూవీ లోని 'పెన్నీ సాంగ్' 24 గంటల్లో 16.38 మిలియన్ ల వ్యూస్ ని సాధించింది.  మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమాలోని 'కళావతి' సాంగ్ 24 గంటల్లో 14.78 మిలియన్ ల వ్యూస్ ను సాధించింది. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమాలోని 'మా మా మహిషా' సాంగ్ 24 గంటల్లో 13.56 మిలియన్ వ్యూస్ ని సాధించింది. ఐ  కాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైస్ మూవీ లోని 'ఊ అంటావా' సాంగ్ 24 గంటల్లో 12.39 మిలియన్ వ్యూస్ ని సాధించింది. పవన్ కళ్యాణ్ ,  దగ్గుబాటి రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన భీమ్లా నాయక్ మూవీ లోని 'లా లా భీమ్లా' సాంగ్  24 గంటల్లో 10.20 మిలియన్ వ్యూస్ ను సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: