జాతి రత్నాలు డైరెక్టర్ ను లైన్ లో పెట్టిన వెంకటేష్..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విక్టరీ వెంకటేష్ తన కెరియర్ లో ఎన్నో హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికి కూడా మోస్ట్ క్రేజీ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు.

విక్టరీ వెంకటేష్ తన కెరియర్ లో ఎక్కువ శాతం ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి ఎక్కువ శాతం ఫ్యామిలీ ఆడియన్స్ అభిమానాన్ని సంపాదించుకున్నాడు  ఇది ఇలా ఉంటే విక్టరీ వెంకటేష్ గతంలో నటించిన నారప్ప , దృశ్యం 2 సినిమాలు  థియేటర్ లలో కాకుండా నేరుగా 'ఓ టి టి' లో విడుదలయ్యాయి. దీనితో వెంకటేష్ అభిమానులు కూడా కాస్త నిరాశ చెందారు. తాజాగా విక్టరీ వెంకటేష్ నటించిన ఎఫ్ 3 సినిమా థియేటర్ లలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విక్టరీ వెంకటేష్, రానా తో కలిసి రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ లో నటించాడు. అలాగే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కభీ ఈద్ కభీ దీవాలి అనే హిందీ సినిమాలో వెంకటేష్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ పూర్తి స్థాయి హీరో పాత్రలో మాత్రం ఏ సినిమాలో కూడా నటించడం లేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం జాతి రత్నాలు మూవీ తో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న అనుదీప్ కే వి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్  నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విక్టరీ వెంకటేష్ కు అనుదీప్ కే వి కథను వినిపించగా , ఆ కథ బాగా నచ్చిన వెంకటేష్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ వార్త ఎంతవరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: