సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా సర్కార్ వారి పాట సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా మే 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో ఈ చిత్ర బృందం లోని సభ్యులు పలు టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లలో, సోషల్ మీడియా ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ సర్కార్ వారి పాట సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూ లో భాగంగా మహేష్ బాబు కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.
అందులో భాగంగా తాజా ఇంటర్వ్యూలో మహేష్ బాబు నటుడు సముద్ర ఖని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. తాజా ఇంటర్వ్యూలో మహేష్ బాబు , సముద్ర ఖని గురించి మాట్లాడుతూ... సముద్ర ఖని గారి తో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. సముద్ర ఖని గారి పాత్ర కోసం చాలా మంది నటులను అనుకున్నాం. కానీ చివరగా సముద్ర ఖని గారు అయితే ఈ పాత్రకు బాగుంటారని నేను చెప్పగానే.. పరశురామ్ కూడా వెంటనే ఓకే అనేశారు. మూవీ షూటింగ్ మొత్తం పూర్తి అయ్యాక... మీరు ఈ మూవీ లో చాలా కళ్ల జోళ్లు వాడారు కదా. నాకొకటి ఇస్తారా, నాకు కళ్ల జోళ్లు కలెక్ట్ చేయడం హాబీ అని సముద్ర ఖని అడిగారు.
డబ్బింగ్ అంతా పూర్తి అయ్యాక మూవీ చూస్తే.. సముద్ర ఖని గారి కోసం కళ్లజోడేంటి... కళ్లజోడు షాపే కొని ఇచ్చేయొచ్చు అని అనిపించింది. సర్కారు వారి పాట మూవీ కి సముద్ర కని పెద్ద ప్లేస్ అని తాజా ఇంటర్వ్యూలో మహేష్ బాబు తెలియజేశాడు. సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా, ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించాడు.