రెబల్ స్టార్ ప్రభాస్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మిర్చి సినిమా వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన ప్రభాస్ మిర్చి సినిమా అనంతరం నటించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో తన మార్కెట్ ను పెంచుకున్నాడు. బాహుబలి సినిమా తర్వాత తన మార్కెట్ ను పాన్ ఇండియా రేంజ్ లో పెంచుకున్న ప్రభాస్ ప్రస్తుతం కూడా పాన్ ఇండియా రేంజ్ సినిమాలలో అంతకుమించిన సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ కొంత కాలం క్రితమే రాధే శ్యామ్ అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
కాకపోతే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఇది ఇలా ఉంటే రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఆది పురుష్ , సలార్ , ప్రాజెక్ట్ కే , సినిమాలలో నటిస్తున్నాడు. ఈ సినిమాలతో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో కూడా ప్రభాస్ 'స్పీరిట్' మూవీ లో నటించబోతున్నాడు. ఈ సినిమాలతో పాటు రెబల్ స్టార్ ప్రభాస్ , మారుతి దర్శకత్వంలో కూడా ఒక సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ ని కూడా చిత్ర బృందం ఫైనల్ చేసినట్లు ఒక వార్త నెటింట్లో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్ లి నటించబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే ఈ సినిమా కోసం ఒక భారీ సెట్ ను చిత్ర బృందం నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ సెట్ లోనే ప్రభాస్ , మారుతి కాంబినేషన్ లో తెరకెక్క బోయే ఈ సినిమా షూటింగ్ ఎక్కువ శాతం జరగనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రభాస్ , మారుతి కాంబినేషన్ లో తెరకెక్క బోయే మూవీ ను 2024 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.