గుడ్ న్యూస్ చెప్పిన అజిత్.. ఫ్యాన్స్ హ్యాపీ?

praveen
తమిళ స్టార్ హీరో అజిత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా వాలిమై హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పై భారీ రేంజ్ లోనే మొదటి నుంచి అంచనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇక ఈ సినిమాలో టాలీవుడ్ యువ హీరో కార్తికేయ విలన్ పాత్రలో నటించాడు అన్న విషయం తెలిసిందే. దీంతో ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు.


 భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయింది మొదటి రోజు నుంచే హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా అటు తెలుగులోనె కాదు అటు తమిళంలో సూపర్హిట్ అయింది అని చెప్పాలి. ఇక ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసాయి. ఇక ఈ సినిమాలో అజిత్ నటనతో పాటు అటు కార్తికేయ నటన కూడా బాగుంది అంటూ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఇక మొన్నటి వరకూ థియేటర్లో సందడి చేసిన అజిత్ ధోవల్ సినిమా మరికొన్ని రోజుల్లో ఓటిటి లో స్ట్రీమింగ్ కాబోతుంది అన్న విషయం తెలిసిందే.



 ఇక జి ఫైవ్ ఓటిటి ప్లాట్ ఫామ్ వేదిక ఈ సినిమా విడుదల కాబోతుంది. దీంతో ఇక ఇప్పటి వరకు అటు థియేటర్లలో ఈ సినిమాను చూడని వారందరూ కూడా ఈ సినిమాని ఓటిటీలో చూస్తూ ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పాలి. ఇలాంటి సమయంలోనే అభిమానులందరికీ గుడ్ న్యూస్ చెప్పింది చిత్రబృందం . ఇక ఈ సినిమాని మలయాళం లాంగ్వేజ్ లో కూడా విడుదల చేయాలంటూ ప్రేక్షకుల నుంచి భారీగా డిమాండ్ లు వచ్చిన నేపథ్యంలో ఇక ప్రేక్షకుల కోరిక మేరకు ఏప్రిల్ 1వ తేదీన జీ5 వేదికగా సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: