పునీత్ చనిపోయిన విషయం.. ఇంకా ఆమెకు తెలియదట?
పునీత్ రాజ్కుమార్ అకాల మరణంతో ఆయన కుటుంబ సభ్యులు కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక ఎన్నో సార్లు పునీత్ భార్య ఆయన లేరు అన్న విషయాన్ని ఇప్పటికీ నమ్మలేక పోతున్నాను అంటూ మీడియా ముందు ఎమోషనల్ అయ్యారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికి కూడా పునీత్ రాజ్కుమార్ హఠాత్ మరణం చెందారు అన్న విషయం పూనీత్ మేనత్త నాగమ్మకు తెలియదట. ఈ విషయాన్ని ఎవరో కాదు ఏకంగా పునీత్ కుటుంబ సభ్యులు చెప్పినట్లు తెలుస్తోంది.. అయితే పునీత్ తండ్రి రాజ్కుమార్ గుండెపోటుతో మరణించారు. ఆ సమయంలో రాజ్ కుమార్ అక్క నాగమ్మ షాక్ లోకి వెళ్లి ఆసుపత్రి పాలయ్యారు.
ఇక ఇప్పుడు ఆమెకి తొంభై ఏళ్ళ వయసు ఉంటుంది. ఈ క్రమంలోనే ఇక తనకు ఎంతో ఇష్టమైన పునీత్ రాజ్కుమార్ లేడు అన్న విషయం తెలిస్తే ఏం జరుగుతుందో అని భయపడి ఈ విషయాన్ని ఇప్పటికీ ఆమెకు తెలియకుండా రహస్యంగానే ఉంచారట కుటుంబ సభ్యులు. పప్పు ఎక్కడికి వెళ్ళాడు నన్ను కలవడానికి రావడం లేదు అని అడుగుతే పునీత్ ఇక లేడు అన్న విషయాన్ని చెప్పలేక గుండె తరుక్కుపోతుందట. ఇక ఆమె అడిగినప్పుడల్లా అవుట్డోర్ షూటింగ్ లకి వెళ్ళాడు.. బిజీగా ఉన్నాడు అంటూ చెబుతూవస్తున్నారట పునీత్ రాజ్కుమార్ కుటుంబ సభ్యులు..