షాకింగ్.. అప్పుడే ఓటీటికి సిద్ధమవుతున్న భీమ్లా నాయక్..?

Purushottham Vinay
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానాదగ్గుబాటి హీరోలుగా నిత్యా మీనన్ హీరోయిన్, సంయుక్త మీనన్ లు హీరోయిన్లు గా నటించిన బ్లాక్ బస్టర్ సినిమా భీమ్లా నాయక్. ఇక ఈ సినిమా రెండు వారాల ముందు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో రూపొందిన భీమ్లా నాయక్ సినిమా వంద కోట్ల వసూళ్ల  దక్కించుకుని రికార్డు అనేది సృష్టించింది.అయినా కాని ఈ సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేకపోయింది..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఎక్కువ వసూళ్ల ను దక్కించుకున్న సినిమాగా ఇది నిలిచింది. ఇక ఇప్పుడు రెండు వందల కోట్ల గ్రాస్ వసూళ్ల వైపుగా వెళుతుంది. ఇక ఈ సినిమ ను అతి త్వరలోనే డిజిటల్ ప్లాట్ ఫారం పై ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అవుతున్నట్లుగా వార్తలు అనేవి వస్తున్నాయి. ఇక అల్లు అర్జున్ హీరో గా నటించిన పుష్ప సినిమా రిలీజ్ అయిన మూడు వారాల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్‌ అయ్యింది . ఆ సినిమా విడుదలైన మూడవ వారానికే అమెజాన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం అయ్యింది.


భీమ్లా నాయక్‌ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా డిజిటల్ ప్లాట్‌ ఫామ్‌ ఒప్పందం చేసుకున్నారని సమాచారం అందుతోంది. ఇప్పటికే మంచి వసూళ్లను భీమ్లా నాయక్‌ సినిమా రాబట్టింది. అలాగే రాధేశ్యామ్‌ సినిమా కూడా ఎల్లుండి విడుదల కాబోతుంది. కాబట్టి పెద్దగా భీమ్లా కు ముందు ముందు రెస్పాన్స్ అనేది ఉండకపోవచ్చు అనే టాక్‌ వినిపిస్తుంది. అందుకే నిర్మాతలు కూడా సినిమాని స్ట్రీమింగ్‌ చేసేందుకు ఓకే చెప్పారనే ప్రచారం అనేది జరుగుతోంది. కానీ అసలు విషయం ఏంటంటే ఇప్పటి వరకు కూడా సినిమా మూడవ వారం లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఎవరు కూడా ప్రకటించ లేదు. ఇక నిర్మాతలు కూడా విషయాన్ని కొట్టి పారేశారు. నాలుగు వారాల థియేట్రికల్ స్క్రీనింగ్‌ పూర్తి అయిన తర్వాత మాత్రమే ఓటీటీలో విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. కాస్త ఆలస్యంగానే అంటే ఈ నెల చివర్లోనే భీమ్లా నాయక్ మూవీని మనం ఓటీటీ ద్వారా చూడబోతున్నాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: